కవర్-అప్ కేసులో సౌదీ, ఈజిప్షియన్లకు SR200,000 జరిమానా..!!
- July 01, 2025
రియాద్: దమ్మామ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కవర్-అప్ (తసత్తూర్) కేసులో దోషులుగా తేలిన తర్వాత సౌదీ పౌరుడు, ఈజిప్షియన్ నివాసికి SR200,000 జరిమానా విధించింది. తూర్పు ప్రావిన్స్లోని ఖాతిఫ్ గవర్నరేట్లో నీటి డీశాలినేషన్ కేసులో వీరిని దోషులుగా తేల్చింది.
అలాగే, కోర్టు వెలువరించిన తీర్పులో వాణిజ్య రిజిస్ట్రేషన్, లైసెన్స్ రద్దు, సంస్థ కార్యకలాపాలను రద్దు చేశారు. అదే విధంగా జకాత్, రుసుములు, పన్నులు వసూలు చేయడం, సంబంధిత వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈజిప్షియన్ జాతీయుడిని బహిష్కరించారు.
ఈజిప్షియన్ చట్టవిరుద్ధమైన కప్పిపుచ్చే కార్యకలాపాలను నిర్వహించడంలో సౌదీ పౌరుడి ప్రమేయం ఉందని కోర్టు తేల్చిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీటి ట్యాంకర్ల నుండి లాభాలలో 40 శాతం అందుకున్నాడని, తద్వారా ఈజిప్షియన్ విదేశీ పెట్టుబడి లైసెన్స్ పొందకుండానే వ్యాపారాన్ని చేశాడని తెలిపింది. యాంటీ-కవర్-అప్ చట్టం ప్రకారం..ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







