కవర్-అప్ కేసులో సౌదీ, ఈజిప్షియన్లకు SR200,000 జరిమానా..!!
- July 01, 2025
రియాద్: దమ్మామ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కవర్-అప్ (తసత్తూర్) కేసులో దోషులుగా తేలిన తర్వాత సౌదీ పౌరుడు, ఈజిప్షియన్ నివాసికి SR200,000 జరిమానా విధించింది. తూర్పు ప్రావిన్స్లోని ఖాతిఫ్ గవర్నరేట్లో నీటి డీశాలినేషన్ కేసులో వీరిని దోషులుగా తేల్చింది.
అలాగే, కోర్టు వెలువరించిన తీర్పులో వాణిజ్య రిజిస్ట్రేషన్, లైసెన్స్ రద్దు, సంస్థ కార్యకలాపాలను రద్దు చేశారు. అదే విధంగా జకాత్, రుసుములు, పన్నులు వసూలు చేయడం, సంబంధిత వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈజిప్షియన్ జాతీయుడిని బహిష్కరించారు.
ఈజిప్షియన్ చట్టవిరుద్ధమైన కప్పిపుచ్చే కార్యకలాపాలను నిర్వహించడంలో సౌదీ పౌరుడి ప్రమేయం ఉందని కోర్టు తేల్చిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీటి ట్యాంకర్ల నుండి లాభాలలో 40 శాతం అందుకున్నాడని, తద్వారా ఈజిప్షియన్ విదేశీ పెట్టుబడి లైసెన్స్ పొందకుండానే వ్యాపారాన్ని చేశాడని తెలిపింది. యాంటీ-కవర్-అప్ చట్టం ప్రకారం..ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









