కవర్-అప్ కేసులో సౌదీ, ఈజిప్షియన్లకు SR200,000 జరిమానా..!!
- July 01, 2025
రియాద్: దమ్మామ్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కవర్-అప్ (తసత్తూర్) కేసులో దోషులుగా తేలిన తర్వాత సౌదీ పౌరుడు, ఈజిప్షియన్ నివాసికి SR200,000 జరిమానా విధించింది. తూర్పు ప్రావిన్స్లోని ఖాతిఫ్ గవర్నరేట్లో నీటి డీశాలినేషన్ కేసులో వీరిని దోషులుగా తేల్చింది.
అలాగే, కోర్టు వెలువరించిన తీర్పులో వాణిజ్య రిజిస్ట్రేషన్, లైసెన్స్ రద్దు, సంస్థ కార్యకలాపాలను రద్దు చేశారు. అదే విధంగా జకాత్, రుసుములు, పన్నులు వసూలు చేయడం, సంబంధిత వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఈజిప్షియన్ జాతీయుడిని బహిష్కరించారు.
ఈజిప్షియన్ చట్టవిరుద్ధమైన కప్పిపుచ్చే కార్యకలాపాలను నిర్వహించడంలో సౌదీ పౌరుడి ప్రమేయం ఉందని కోర్టు తేల్చిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీటి ట్యాంకర్ల నుండి లాభాలలో 40 శాతం అందుకున్నాడని, తద్వారా ఈజిప్షియన్ విదేశీ పెట్టుబడి లైసెన్స్ పొందకుండానే వ్యాపారాన్ని చేశాడని తెలిపింది. యాంటీ-కవర్-అప్ చట్టం ప్రకారం..ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







