ఫేక్ ఫారెక్స్ స్కామ్ల వెనుక ఇండియన్ భారతీయ కాల్ సెంటర్లు..!!
- July 03, 2025
యూఏఈ: యూఏఈలో వెలుగు చూసిన ఫేక్ ఫారెక్స్ స్కామ్ వెనుక ఇండియాలోని కాల్ సెంటర్లు ఉన్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. భారత్ లోని నోయిడాలో రెండు, జైపూర్ కేంద్రంగా ఒక కాల్ సెంటర్ కేంద్రం ఈ స్కామ్ నడుస్తుందని పేర్కొన్నారు. అవి దుబాయ్ ఆధారిత ఫారెక్స్ (విదేశీ మార్పిడి) సంస్థలుగా నటిస్తూ, అనుమానం కలుగుకుండా పెట్టుబడిదారులను మోసం చేస్తున్నారని, ఇందుకుగాను స్పూఫ్డ్ +971 నంబర్లను ఉపయోగిస్తున్నాయని వెల్లడైంది.
ఈ కేసుకు సంబంధించి మాజీ ఉద్యోగులు వివరాలను వెల్లడించారు. తమకు ఇచ్చే కాంటాక్ట్ లీస్టులలో అనేక మంది యూఏఈ మొబైల్ నంబర్లు ఉన్నాయని తెలిపారు. ఇండియాలోని కాల్ సెంటర్ నుంచి దుబాయ్ లోని కస్టమర్లకు కాల్ చేస్తామని తెలిపారు. కొన్ని రోజులకు కొత్త డేటా వస్తుందని, ఏజెంట్లకు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రతి కేంద్రంలో 50 నుండి 100 మంది ఏజెంట్లు ఉంటారన్నారు. తాము ఉదయం 8 నుండి రాత్రి 11 గంటల వరకు రోజుకు 150 కాల్స్ చేస్తామని తెలిపారు. కాల్స్ యూఏఈ నంబర్ల కనిపించేందుకు సాఫ్ట్వేర్ ద్వారా రూట్ అవుతాయని, అవి దుబాయ్లోని వ్యాపార కేంద్రాల నుండి వచ్చినట్లు బాధితులకు కనిపిస్తాయ తెలిపారు. ఎవరైనా +971ని చూసిన వెంటనే, వారు ఫోన్ అటెంట్ చేస్తారని, వారి దృష్టిని ఆకర్షించడానికి అది సరిపోతుందని ఆమె వివరించింది.
భారతదేశం ఇప్పటికే టెలి-ఫ్రాడ్కు ప్రపంచవ్యాప్త హాట్స్పాట్ గా ఉంది. 2022లోనే, అమెరికన్లు స్కామ్ల వల్ల $10 బిలియన్లకు పైగా కోల్పోయారు. చాలా వరకు వీటి వెనుక భారతీయ కాల్ సెంటర్లకు చెందినవిగా గుర్తించారు. కొన్ని బందిపోటు కార్యకలాపాలు నెలకు $600,000 కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు యూఏఈ నివాసితులు తమ పట్టులో ఉన్నందున, భారతీయ స్కామ్ సిండికేట్లు తమ మోసాలను విస్తృతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రవాస భారతీయులు, యూఏఈ నివాసితులు లక్ష్యంగా వీరి పనిచేస్తారని పేర్కొన్నారు.
ఈ మేరకు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ X లో హెచ్చరిక జారీ చేసింది. పెట్టుబడి పెట్టే ముందు సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) ద్వారా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల లైసెన్సింగ్ స్థితిని ధృవీకరించాలని నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!







