సహకారం బలోపేతం..భారత్ తో GCC రాయబారులు భేటీ..!!
- July 03, 2025
కువైట్: భారతదేశంతో సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను చర్చించడానికి న్యూఢిల్లీలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల రాయబారులు కువైట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ప్రస్తుత అధిపతిగా కువైట్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సమీక్షించారు. వివిధ రంగాలలో GCC- భారత సంబంధాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మార్గాలను చర్చించినట్లు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఖతార్పై ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలు, మంచి నేబర్ హుడ్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు ముఖ్యమైన జలమార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేత బెదిరింపులపై GCC రాయబారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









