రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు జంట అరెస్ట్
- July 03, 2025
హైదరాబాద్: రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయని భరోసా ఇచ్చి, కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసగించిన దంపతులు పోలీసులకు పట్టుబడ్డారు.ఈ సంఘటన హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో కలకలం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన పనేమ్ సురేశ్, పనేమ్ ఉజ్వల అనే భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పడ్డారు. వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు.సైబరాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
మెసర్స్ క్రిస్ట్ ప్రాపర్టీస్, అగర్వుడ్ ఫార్మ్ల్యాండ్ వంటి పేర్లతో కంపెనీలు ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రచారంతో సుమారు రూ.2.11 కోట్లు వసూలు చేశారు.రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలేమీ కనిపించలేదు. అసలు డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుల పై బాచుపల్లి, కొల్లూరు, చందానగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్నారు. సాక్ష్యాల ఆధారంగా నిందితుల అరెస్టు జరిగిందని సమాచారం. ఈ దంపతులు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







