రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టిన నెల్లూరు జంట అరెస్ట్
- July 03, 2025
హైదరాబాద్: రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయని భరోసా ఇచ్చి, కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజలను మోసగించిన దంపతులు పోలీసులకు పట్టుబడ్డారు.ఈ సంఘటన హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో కలకలం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన పనేమ్ సురేశ్, పనేమ్ ఉజ్వల అనే భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పడ్డారు. వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు.సైబరాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
మెసర్స్ క్రిస్ట్ ప్రాపర్టీస్, అగర్వుడ్ ఫార్మ్ల్యాండ్ వంటి పేర్లతో కంపెనీలు ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రచారంతో సుమారు రూ.2.11 కోట్లు వసూలు చేశారు.రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారికి లాభాలేమీ కనిపించలేదు. అసలు డబ్బులు కూడా తిరిగి రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుల పై బాచుపల్లి, కొల్లూరు, చందానగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్నారు. సాక్ష్యాల ఆధారంగా నిందితుల అరెస్టు జరిగిందని సమాచారం. ఈ దంపతులు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







