స్మార్ట్ యాప్ ద్వారా తన తండ్రిపై 10 ఏళ్ల బాలుడు ఫిర్యాదు..!!
- July 04, 2025
దుబాయ్: 10 ఏళ్ల బాలుడు దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్ ఉపయోగించి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు. వెంటనే బాలల, మహిళా రక్షణ విభాగం స్పందించింది. తన తమ్ముళ్లలా కాకుండా, తన తండ్రి తనను పదే పదే కొడుతున్నాడని బాలుడు ఫిర్యాదులో చెప్పాడు. తండ్రి కొట్టిన దెబ్బల వల్ల అతని శరీరంపై కనిపించే గాయాలు ఏర్పడ్డాయని, వాటిని అతను క్లాస్మేట్స్ నుండి దాచడానికి ప్రయత్నించాడని, పాఠశాలలో అతని పనితీరు కూడా తగ్గడం ప్రారంభమైందని అధికారులకు అతని స్కూల్ సామాజిక కార్యకర్త తెలిపింది. గాయాలను గమనించగానే దుబాయ్ పోలీసులను సంప్రదించినట్లు తెలిపారు.
బాలల, మహిళా రక్షణ విభాగం డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అలీ అల్ మాత్రూషి ప్రకారం. మొదట్లో ఆ బాలుడు తన తండ్రికి భయపడి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. "పాఠశాల సామాజిక కార్యకర్త పిల్లవాడికి నమ్మకాన్ని కలిగించారు. పోలీసు స్మార్ట్ యాప్ను ఉపయోగించమని సూచించారు." అని అల్ మాత్రూషి అన్నారు.
దుబాయ్ పోలీసులు తండ్రిని పిలిపించారు. అతను తన కొడుకును కొట్టినట్లు అంగీకరించాడు. కానీ హాని కలిగించే ఉద్దేశ్యం లేదని చెప్పాడని అల్ మాత్రూషి తెలిపారు. "కఠినమైన క్రమశిక్షణ పిల్లవాడిని మంచిగా పెంచుతుందని అతను భావించాడు. కానీ దాని వల్ల బాలుడు గాయపడ్డాడు. అతని మానసిక పరిస్థితిపై ప్రభావం చూపింది." అని అల్ మాత్రూషి అన్నారు. ఈ రకమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, చట్టం ప్రకారం శిక్షార్హమైనదని తెలిపారు. తండ్రి తన పద్ధతిని మార్చుకుంటానని చెప్పాడని పోలీసులు తెలిపారు.
యూఏఈ పిల్లల రక్షణ చట్టం ప్రకారం పిల్లల హక్కులు రక్షించబడతాయని నివాసితులకు గుర్తు చేశారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, వెబ్సైట్ ద్వారా, 901 కు కాల్ చేయడం ద్వారా లేదా అల్ ట్వార్లోని దుబాయ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని చైల్డ్ ఒయాసిస్ను సందర్శించడం ద్వారా సంఘటనలను నివేదించాలని సూచించారు.
యూఏఈలో నివసిస్తున్న పిల్లల హక్కులు, శ్రేయస్సును కాపాడటానికి సమగ్ర పిల్లల రక్షణ చట్టాన్ని అమలు చేసింది. వదీమా చట్టం అని పిలువబడే ఫెడరల్ చట్టం దేశంలో పిల్లల రక్షణకు మూలస్తంభంగా ఉందని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల







