Dh30,000 నగదు చోరీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు..!!
- July 04, 2025
దుబాయ్: అల్రాస్లోని నాలుగు ట్రేడింగ్ కంపెనీల కార్యాలయాల్లోకి చొరబడిన ఐదుగురు ఇథియోపియన్ జాతీయుల ముఠాపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది. అధికారుల కథనం ప్రకారం, అనుమానితులు బలవంతంగా లోపలికి ప్రవేశించి, సేఫ్ లాకర్లను తెరిచి సుమారు Dh30,000 నగదును దొంగిలించారు.
కంపెనీ యజమానులు ఉదయం వారి కార్యాలయానికి చేరుకుని, సేఫ్లు ధ్వంసం చేయబడినట్లు గుర్తించి, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. పెట్రోలింగ్ అధికారులు, క్రైమ్-సీన్ ఇన్వెస్టిగేటర్లు, ఫోరెన్సిక్ నిపుణుల సంయుక్త బృందం ఆధారాలను సేకరించి, సిసిటివి ఫుటేజ్లో అనుమానితులు టయోటా కరోల్లా కారులో పారిపోయినట్లు గుర్తించారు.
వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నలుగురు అనుమానితులను అబుదాబిలో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఐదుగురు అనుమానితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 18,000 దిర్హామ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని వారు తమ స్వదేశానికి బదిలీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, దితులపై త్వరలో అధికారికంగా అభియోగాలు మోపబడతాయని అధికారలు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







