Dh30,000 నగదు చోరీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు..!!
- July 04, 2025
దుబాయ్: అల్రాస్లోని నాలుగు ట్రేడింగ్ కంపెనీల కార్యాలయాల్లోకి చొరబడిన ఐదుగురు ఇథియోపియన్ జాతీయుల ముఠాపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది. అధికారుల కథనం ప్రకారం, అనుమానితులు బలవంతంగా లోపలికి ప్రవేశించి, సేఫ్ లాకర్లను తెరిచి సుమారు Dh30,000 నగదును దొంగిలించారు.
కంపెనీ యజమానులు ఉదయం వారి కార్యాలయానికి చేరుకుని, సేఫ్లు ధ్వంసం చేయబడినట్లు గుర్తించి, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. పెట్రోలింగ్ అధికారులు, క్రైమ్-సీన్ ఇన్వెస్టిగేటర్లు, ఫోరెన్సిక్ నిపుణుల సంయుక్త బృందం ఆధారాలను సేకరించి, సిసిటివి ఫుటేజ్లో అనుమానితులు టయోటా కరోల్లా కారులో పారిపోయినట్లు గుర్తించారు.
వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నలుగురు అనుమానితులను అబుదాబిలో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఐదుగురు అనుమానితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 18,000 దిర్హామ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని వారు తమ స్వదేశానికి బదిలీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, దితులపై త్వరలో అధికారికంగా అభియోగాలు మోపబడతాయని అధికారలు వెల్లడించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









