Dh30,000 నగదు చోరీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు..!!
- July 04, 2025
దుబాయ్: అల్రాస్లోని నాలుగు ట్రేడింగ్ కంపెనీల కార్యాలయాల్లోకి చొరబడిన ఐదుగురు ఇథియోపియన్ జాతీయుల ముఠాపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు చేస్తోంది. అధికారుల కథనం ప్రకారం, అనుమానితులు బలవంతంగా లోపలికి ప్రవేశించి, సేఫ్ లాకర్లను తెరిచి సుమారు Dh30,000 నగదును దొంగిలించారు.
కంపెనీ యజమానులు ఉదయం వారి కార్యాలయానికి చేరుకుని, సేఫ్లు ధ్వంసం చేయబడినట్లు గుర్తించి, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. పెట్రోలింగ్ అధికారులు, క్రైమ్-సీన్ ఇన్వెస్టిగేటర్లు, ఫోరెన్సిక్ నిపుణుల సంయుక్త బృందం ఆధారాలను సేకరించి, సిసిటివి ఫుటేజ్లో అనుమానితులు టయోటా కరోల్లా కారులో పారిపోయినట్లు గుర్తించారు.
వాహనం లైసెన్స్ ప్లేట్ నంబర్ ఆధారంగా ట్రాక్ చేసి డ్రైవర్ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నలుగురు అనుమానితులను అబుదాబిలో అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఐదుగురు అనుమానితులు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 18,000 దిర్హామ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని వారు తమ స్వదేశానికి బదిలీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, దితులపై త్వరలో అధికారికంగా అభియోగాలు మోపబడతాయని అధికారలు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







