బహ్రెయిన్ - లెబనాన్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరుణ..!!
- July 04, 2025
మానామా: బహ్రెయిన్ బీరూట్లోని తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. దాదాపు నాలుగు సంవత్సరాల దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. లెబనాన్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం, ప్రస్తుతం సిరియాలో ఉన్న బహ్రెయిన్ లెబనాన్లో కొత్తగా నియమితులైన రాయబారి వహీద్ ముబారక్ సయ్యార్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. లెబనాన్ తో బలమైన దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి బహ్రెయిన్ నిబద్ధతతో పనిచేస్తుందని సయ్యార్ తెలిపారు.
లెబనాన్.. అనేక గల్ఫ్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన వివాదం తరువాత, బహ్రెయిన్ అక్టోబర్ 2021లో బీరుట్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. యెమెన్లో సౌదీ నేతృత్వంలోని సైనిక ప్రచారాన్ని విమర్శించిన లెబనాన్ మాజీ సమాచార మంత్రి జార్జ్ కొర్దాహి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. అతని వ్యాఖ్యల కారణంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ తమ రాయబారులను వెనక్కి పిలిపించుకుని లెబనీస్ రాయబారులను బహిష్కరించాయి. కాగా, సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నంలో కొర్దాహి డిసెంబర్ 2021లో పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో వివాదం సద్దమణిగినట్టైంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







