బహ్రెయిన్ - లెబనాన్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరుణ..!!
- July 04, 2025
మానామా: బహ్రెయిన్ బీరూట్లోని తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. దాదాపు నాలుగు సంవత్సరాల దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. లెబనాన్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం, ప్రస్తుతం సిరియాలో ఉన్న బహ్రెయిన్ లెబనాన్లో కొత్తగా నియమితులైన రాయబారి వహీద్ ముబారక్ సయ్యార్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. లెబనాన్ తో బలమైన దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి బహ్రెయిన్ నిబద్ధతతో పనిచేస్తుందని సయ్యార్ తెలిపారు.
లెబనాన్.. అనేక గల్ఫ్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన వివాదం తరువాత, బహ్రెయిన్ అక్టోబర్ 2021లో బీరుట్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. యెమెన్లో సౌదీ నేతృత్వంలోని సైనిక ప్రచారాన్ని విమర్శించిన లెబనాన్ మాజీ సమాచార మంత్రి జార్జ్ కొర్దాహి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. అతని వ్యాఖ్యల కారణంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ తమ రాయబారులను వెనక్కి పిలిపించుకుని లెబనీస్ రాయబారులను బహిష్కరించాయి. కాగా, సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నంలో కొర్దాహి డిసెంబర్ 2021లో పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో వివాదం సద్దమణిగినట్టైంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









