బహ్రెయిన్ - లెబనాన్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరుణ..!!
- July 04, 2025
మానామా: బహ్రెయిన్ బీరూట్లోని తన రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. దాదాపు నాలుగు సంవత్సరాల దౌత్యపరమైన ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. లెబనాన్ ప్రధాన మంత్రి నవాఫ్ సలాం, ప్రస్తుతం సిరియాలో ఉన్న బహ్రెయిన్ లెబనాన్లో కొత్తగా నియమితులైన రాయబారి వహీద్ ముబారక్ సయ్యార్ మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. లెబనాన్ తో బలమైన దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి బహ్రెయిన్ నిబద్ధతతో పనిచేస్తుందని సయ్యార్ తెలిపారు.
లెబనాన్.. అనేక గల్ఫ్ దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన వివాదం తరువాత, బహ్రెయిన్ అక్టోబర్ 2021లో బీరుట్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. యెమెన్లో సౌదీ నేతృత్వంలోని సైనిక ప్రచారాన్ని విమర్శించిన లెబనాన్ మాజీ సమాచార మంత్రి జార్జ్ కొర్దాహి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. అతని వ్యాఖ్యల కారణంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ తమ రాయబారులను వెనక్కి పిలిపించుకుని లెబనీస్ రాయబారులను బహిష్కరించాయి. కాగా, సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నంలో కొర్దాహి డిసెంబర్ 2021లో పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో వివాదం సద్దమణిగినట్టైంది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









