హైకోర్టు ని సంప్రదించిన 'కబాలి' నిర్మాత!
- July 14, 2016
సూపర్స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థను గురువారం మద్రాసు హైకోర్టును సంప్రదించారు. 'కబాలి' చిత్రాన్ని అనధికారికంగా డౌన్లోడ్ చేసుకుంటున్న దాదాపు 180కి పైగా వెబ్సైట్లను తొలగించాలని కలైపులి హైకోర్టులో పిటీషను దాఖలు చేశారు. అనధికారికంగా డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్లను ట్రాయ్ సహాయంతో బ్లాక్ చేయాలని పిటీషన్లో కలైపులి కోరారు. తమిళనాడు పైరసీ వ్యతిరేక సెల్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆన్లైన్ ద్వారా రావాల్సిన వంద శాతం ఆదాయంలో 70 శాతం అనధికారిక డౌన్లోడింగ్వల్ల పోతోందని, మిగిలిన 30 శాతం మాత్రమే వస్తోందని ఆయన పేర్కొన్నారు. 'కబాలి' చిత్రం జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికాఆప్టే కథానాయికగా నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







