హైకోర్టు ని సంప్రదించిన 'కబాలి' నిర్మాత!
- July 14, 2016
సూపర్స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థను గురువారం మద్రాసు హైకోర్టును సంప్రదించారు. 'కబాలి' చిత్రాన్ని అనధికారికంగా డౌన్లోడ్ చేసుకుంటున్న దాదాపు 180కి పైగా వెబ్సైట్లను తొలగించాలని కలైపులి హైకోర్టులో పిటీషను దాఖలు చేశారు. అనధికారికంగా డౌన్లోడ్ చేసుకునే వెబ్సైట్లను ట్రాయ్ సహాయంతో బ్లాక్ చేయాలని పిటీషన్లో కలైపులి కోరారు. తమిళనాడు పైరసీ వ్యతిరేక సెల్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆన్లైన్ ద్వారా రావాల్సిన వంద శాతం ఆదాయంలో 70 శాతం అనధికారిక డౌన్లోడింగ్వల్ల పోతోందని, మిగిలిన 30 శాతం మాత్రమే వస్తోందని ఆయన పేర్కొన్నారు. 'కబాలి' చిత్రం జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికాఆప్టే కథానాయికగా నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









