జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, అబుదాబి డిప్యూటీ రూలర్ భేటీ..!!
- July 05, 2025
జెడ్డాః సౌదీ అరేబియా ప్రధాన మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో గురువారం జెడ్డాలో అబుదాబి డిప్యూటీ పాలకుడు, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిపారు.
అల్-సలాం ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకులు తమ దేశాల మధ్య సహకారంపై సమీక్షించారు. వివిధ రంగాలలో వ్యూహాత్మక సంబంధాలను మరింత మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి సంబంధించిన మార్గాలపై చర్చించారు.
ఈ మేరకు ప్లాట్ఫామ్ Xలోని తన అధికారిక ఖాతాలోని పోస్ట్లో షేక్ తహ్నౌన్ జెద్దా పర్యటన ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్యంలో ప్రస్తుత పరిణామాలకు సంబంధించి రెండు దేశాల నాయకత్వాల మధ్య జరుగుతున్న సంప్రదింపులలో భాగమని తెలిపారు.
షేక్ తహ్నౌన్ ద్వైపాక్షిక, ఉమ్మడి అరబ్ ప్రాముఖ్యతపై యూఏఈ బలమైన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి, ఈ ప్రాంతానికి స్థిరమైన భవిష్యత్ ను అందించడానికి నిరంతర సమన్వయంతో ముందుకు కదలాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







