3 ఏళ్లలో 65 దేశాలలో 1 బిలియన్ మీల్స్ పంపిణీ..!!
- July 05, 2025
యూఏఈః యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. 50 దేశాలలో పేదలకు ఆహార సహాయం చేసే లక్ష్యంతో 2022 రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ప్రచారాన్ని ప్రారంభించారు. జూలై 4 తో ఈ ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు. 65 దేశాలలో ఒక బిలియన్ మీల్స్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో 260 మిలియన్ల మీల్స్ పంపిణీ చేయనున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి చెప్పారు.
''వన్ బిలియన్ మీల్స్'' ప్రచారం గత కొన్ని ఏళ్లుగా షేక్ మొహమ్మద్ ప్రకటిస్తున్నారు. 10 మిలియన్ మీల్స్, 100 మిలియన్ మీల్స్, 1 బిలియన్ మీల్స్ ప్రచారంతో ఆ ధోరణి ముందుకు విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2022లో జోర్డాన్, భారతదేశం, పాకిస్తాన్, లెబనాన్, కిర్గిజ్స్తాన్, అంగోలా, ఉగాండాతో సహా 13 దేశాలలో నిరాశ్రయులైన వ్యక్తులు, కుటుంబాలతోపాటు ఆహారం అవసరమైన వారందరికి సహాయాన్ని అందించారు.
2030 నాటికి ఆకలి చావులను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2 ను సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పేద వర్గాలకు స్థిరమైన మానవతా సహాయం అందించే ప్రపంచ అవసరానికి వన్ బిలియన్ మీల్స్ ప్రచారం ప్రతిస్పందిస్తుందని యూఏఈ వెల్లడించింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!