3 ఏళ్లలో 65 దేశాలలో 1 బిలియన్ మీల్స్ పంపిణీ..!!
- July 05, 2025
యూఏఈః యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. 50 దేశాలలో పేదలకు ఆహార సహాయం చేసే లక్ష్యంతో 2022 రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ప్రచారాన్ని ప్రారంభించారు. జూలై 4 తో ఈ ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు. 65 దేశాలలో ఒక బిలియన్ మీల్స్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో 260 మిలియన్ల మీల్స్ పంపిణీ చేయనున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి చెప్పారు.
''వన్ బిలియన్ మీల్స్'' ప్రచారం గత కొన్ని ఏళ్లుగా షేక్ మొహమ్మద్ ప్రకటిస్తున్నారు. 10 మిలియన్ మీల్స్, 100 మిలియన్ మీల్స్, 1 బిలియన్ మీల్స్ ప్రచారంతో ఆ ధోరణి ముందుకు విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2022లో జోర్డాన్, భారతదేశం, పాకిస్తాన్, లెబనాన్, కిర్గిజ్స్తాన్, అంగోలా, ఉగాండాతో సహా 13 దేశాలలో నిరాశ్రయులైన వ్యక్తులు, కుటుంబాలతోపాటు ఆహారం అవసరమైన వారందరికి సహాయాన్ని అందించారు.
2030 నాటికి ఆకలి చావులను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2 ను సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పేద వర్గాలకు స్థిరమైన మానవతా సహాయం అందించే ప్రపంచ అవసరానికి వన్ బిలియన్ మీల్స్ ప్రచారం ప్రతిస్పందిస్తుందని యూఏఈ వెల్లడించింది.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







