3 ఏళ్లలో 65 దేశాలలో 1 బిలియన్ మీల్స్ పంపిణీ..!!
- July 05, 2025
యూఏఈః యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. 50 దేశాలలో పేదలకు ఆహార సహాయం చేసే లక్ష్యంతో 2022 రమదాన్ లో 'వన్ బిలియన్ మీల్స్' ప్రచారాన్ని ప్రారంభించారు. జూలై 4 తో ఈ ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు దుబాయ్ పాలకుడు ప్రకటించారు. 65 దేశాలలో ఒక బిలియన్ మీల్స్ పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాబోయే సంవత్సరంలో 260 మిలియన్ల మీల్స్ పంపిణీ చేయనున్నట్లు యూఏఈ ప్రధాన మంత్రి చెప్పారు.
''వన్ బిలియన్ మీల్స్'' ప్రచారం గత కొన్ని ఏళ్లుగా షేక్ మొహమ్మద్ ప్రకటిస్తున్నారు. 10 మిలియన్ మీల్స్, 100 మిలియన్ మీల్స్, 1 బిలియన్ మీల్స్ ప్రచారంతో ఆ ధోరణి ముందుకు విజయవంతంగా ముందుకు సాగుతోంది. 2022లో జోర్డాన్, భారతదేశం, పాకిస్తాన్, లెబనాన్, కిర్గిజ్స్తాన్, అంగోలా, ఉగాండాతో సహా 13 దేశాలలో నిరాశ్రయులైన వ్యక్తులు, కుటుంబాలతోపాటు ఆహారం అవసరమైన వారందరికి సహాయాన్ని అందించారు.
2030 నాటికి ఆకలి చావులను అంతం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 2 ను సాధించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పేద వర్గాలకు స్థిరమైన మానవతా సహాయం అందించే ప్రపంచ అవసరానికి వన్ బిలియన్ మీల్స్ ప్రచారం ప్రతిస్పందిస్తుందని యూఏఈ వెల్లడించింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







