ఫుజైరాలో బీచ్కి వెళ్లేవారికి సేఫ్టీ టిప్స్..ప్రమాదాలపై ఆందోళన..!!
- July 05, 2025
యూఏఈ: ఫుజైరా రెస్క్యూ బృందాలు గత సంవత్సరం ఎమిరాటీలు, ప్రవాసులు సహా 26 మందిని మునిగిపోకుండా కాపాడాయి. అయినా, ఒకరు మరణించిన సంఘటన నమోదైంది. వేసవిలో బీచ్ కు వచ్చేవారితో తీరప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా అధికారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. సముద్రంలో ఈత కొడుతూ మునిగిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లు, పడవ లాంటి రక్షణలు ఉన్న చోటనే సముద్రంలోకి దిగాలని సూచించారు.
ఈ సందర్భంగా కీలక భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు:
-బోటింగ్ చేసేటప్పుడు లేదా ఆఫ్షోర్లో ఈత కొట్టేటప్పుడు ఎల్లప్పుడూ లైఫ్ జాకెట్లు ధరించాలి.
-పర్యవేక్షణ లేని లేదా నిషేధించబడిన ప్రాంతాలకు దూరంగా ఉండండి.
-బయటకు వెళ్లే ముందు సముద్ర వాతావరణ అప్డేట్ లను తెలుసుకోవాలి.
- పిల్లలను నీటి దగ్గర ఎప్పుడూ పర్యవేక్షణ లేకుండా వదిలివేయవద్దు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









