IRCTC శ్రీ రామాయణ యాత్ర..
- July 05, 2025
అయోధ్య రామాలయానికి భక్తుల్లో ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన 5వ ప్రత్యేక రామాయణ రైలు యాత్రకు శ్రీకారం చుట్టింది. జూలై 25న ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
ఈ పర్యటనలో కవర్ చేసే ప్రదేశాలు ఇవే..
ఈ పర్యటన భారత దేశంలోని శ్రీరాముడితో ముడిపడి ఉన్న 30కి పైగా పుణ్య క్షేత్రాలను కవర్ చేస్తుంది. IRCTC విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఈ పర్యటన జూలై 25న ఢిల్లీ సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలులో ప్రయాణం ఉంటుంది.
”స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైల్లో రెండు రెస్టారెంట్లు, ఒక ఆధునిక వంట గది, కోచ్లలో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్రూమ్ ఫంక్షన్లు, ఒక ఫుట్ మసాజర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి” అని ప్రెస్ నోట్ లో తెలిపారు.
ఈ పర్యటన అయోధ్య నుండి ప్రారంభమవుతుంది. నందిగ్రామ్, సీతామర్హి, జనక్పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, చివరిగా దక్షిణ భారత దేశంలోని రామేశ్వరం ద్వీపానికి వెళ్లి తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.
జనవరి 2024లో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరిగినప్పటి నుండి భక్తులు ఈ ప్రదేశాలకు క్యూ కట్టారు. మతపరమైన, సాంస్కృతిక పర్యాటకం భారీ ప్రోత్సాహాన్ని పొందిందని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారులు తెలిపారు. “ప్రారంభమైనప్పటి నుండి, ఇది మేము నిర్వహిస్తున్న 5వ రామాయణ పర్యటన. గత పర్యటనలన్నింటికీ ప్రయాణికులు, యాత్రికుల నుండి మంచి స్పందన లభించింది” అని IRCTC సిబ్బంది తెలిపింది.
యాత్రకు అయ్యే ఖర్చు ఎంతంటే…
శ్రీ రామాయణ యాత్రకు 3 ఏసీకి ఒక్కొక్కరికి దాదాపు రూ.1,17,975
2 ఏసీకి ఒక్కొక్కరికి రూ.1,40,120,
1 ఏసీ క్లాస్ క్యాబిన్కు రూ.1,66,380
1 ఏసీ కూపేకి రూ.1,79,515 ఖర్చవుతుంది.
ప్యాకేజీ ధరలో రైలు ప్రయాణం, 3-స్టార్ కేటగిరీ హోటళ్లలో 1 AC, 2 AC, 3 ACల వసతి కూడా ఉన్నాయని IRCTC తెలిపింది. ఈ ధరలో అన్ని భోజనాలు (శాఖాహారం మాత్రమే), AC కోచ్లలో సైట సీయింగ్, ప్రయాణ బీమా, IRCTC టూర్ మేనేజర్ల సేవలు మొదలైనవి కూడా ఉన్నాయని IRCTC తెలిపింది.
ఏయే సౌకర్యాలు కల్పిస్తారు?
IRCTC ప్రెస్ నోట్ ప్రకారం, “పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు మూడు రకాల వసతిని అందిస్తుంది. అవి 1AC, 2AC, 3AC. ఈ రైలులో ప్రతి కోచ్కు CCTV కెమెరాలు, సెక్యూరిటీ గార్డులతో కూడిన భద్రత ఉంటుంది. ఈ పర్యటన 17 రోజుల్లో పూర్తవుతుంది. మొదటి గమ్యస్థానం అయోధ్య. ఇక్కడ పర్యాటకులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయు ఘాట్) సందర్శిస్తారు. సీత జన్మస్థలాన్ని సందర్శించిన తర్వాత, పర్యటన బక్సర్కు వెళుతుంది. అక్కడ సందర్శనా స్థలాలలో రామరేఖ ఘాట్, రామేశ్వర్నాథ్ ఆలయం ఉంటాయి.
తాజా వార్తలు
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?







