దక్షిణ సూడాన్‌కి చేరుకున్న సహాయక అధికారులు

- July 14, 2016 , by Maagulf
దక్షిణ సూడాన్‌కి చేరుకున్న సహాయక అధికారులు

దక్షిణ సూడాన్‌లో అంతర్‌యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి 500మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ నేతృత్వంలోని సహాయక అధికారుల బృందం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దక్షిణ సూడాన్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాలు రేపు తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్‌పోర్టులకు చేరుకోనున్నాయి. భారతీయుల బృందంలో ఉన్న 54మంది తెలంగాణవాసులు స్వదేశానికి చేరుకోనున్నారు. తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రెసిడెన్స్ కమిషనర్ శశాంక్‌గోయల్ విదేశాంగ, రైల్వే అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు శశాంక్‌గోయల్ చెప్పారు. రైళ్లు లేదా విమానంలో తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపుతమని తెలిపారు. తిరువనంతపురం చేరుకున్న వారికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com