దక్షిణ సూడాన్కి చేరుకున్న సహాయక అధికారులు
- July 14, 2016
దక్షిణ సూడాన్లో అంతర్యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి 500మంది భారతీయులు స్వదేశానికి రానున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ నేతృత్వంలోని సహాయక అధికారుల బృందం భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు దక్షిణ సూడాన్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానాలు రేపు తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్టులకు చేరుకోనున్నాయి. భారతీయుల బృందంలో ఉన్న 54మంది తెలంగాణవాసులు స్వదేశానికి చేరుకోనున్నారు. తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రెసిడెన్స్ కమిషనర్ శశాంక్గోయల్ విదేశాంగ, రైల్వే అధికారులతో చర్చిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు శశాంక్గోయల్ చెప్పారు. రైళ్లు లేదా విమానంలో తెలంగాణ వాసులను రాష్ర్టానికి పంపుతమని తెలిపారు. తిరువనంతపురం చేరుకున్న వారికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









