AI ఫెడరల్ ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించిన షేక్ మొహమ్మద్..!!
- July 07, 2025
యూఏఈ: యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ స్ట్రాటజిక్ ప్లాన్ 2031ని ప్రారంభించింది. ఇది ప్రభుత్వ వనరుల నిర్వహణను మెరుగుపరచడానికి AIని ఉపయోగించడంపై దృష్టి పెడుతుందని తెలిపారు. ఈ ప్రణాళిక తెలివైన, వేగవంతమైన, మరింత సమర్థవంతమైన ప్రభుత్వాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది అని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా యూఏఈ వివిధ రంగాలలో తాజా సాంకేతికతను స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. AI సజావుగా సేవను అందించేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు.
కృత్రిమ మేధస్సు ఇప్పటికే ఎమిరేట్స్ ప్రభుత్వంలో భాగంగా ఉందని, ఇప్పటికే పలు రంగాల్లో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పౌరులు, నివాసితులపై చట్టాల ప్రభావాన్ని అంచనా వేయడానికి పెద్ద ఎత్తున డేటాను పొందడానికి దేశం AIని ఉపయోగిస్తోందన్నారు. గత నెలలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ పై క్యాబినెట్, మినిస్టీరియల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఫెడరల్ ఎంటిటీలు, ప్రభుత్వ కంపెనీల అన్ని డైరెక్టర్ల బోర్డులలో చర్చించాలని, జనవరి 2026 నుండి దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కిండర్ గార్టెన్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో AI ని బోధించిన మొదటి దేశాలలో యూఏఈ కూడా ఒకటని గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







