అమెజాన్ బేసిన్లో 94 మంది అరెస్ట్..$64 మిలియన్ల ఆస్తులు సీజ్..!!
- July 09, 2025
యూఏఈ: అమెజాన్ బేసిన్లో పర్యావరణ నేరాలపై యూఏఈ ఉక్కుపాదం మోపింది. 94 మంది అనుమానితులను అరెస్టు చేయడంతోపాటు $64 మిలియన్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక పోస్ట్లో ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తెలిపారు.ఆపరేషన్ గ్రీన్ షీల్డ్ లో భాగంగా అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు.కొలంబియా, బ్రెజిల్, పెరూ,ఈక్వెడార్ల సమన్వయంతో యూఏఈ 14 రోజులపాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిందని తెలిపారు.
2023లో దుబాయ్లో జరిగిన COP28 వాతావరణ సమావేశంలో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) భాగస్వామ్యంతో యూఏఈ గ్లోబల్ ఇనిషియేటివ్, లా ఎన్ఫోర్స్మెంట్ ఫర్ క్లైమేట్ (I2LEC) కింద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ సంవత్సరం మే నెలలో యూఏఈ కొత్త వాతావరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024లో అల్ వాత్బాలోని రక్షిత రిజర్వ్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులకు Dh165,000 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్









