అమెజాన్ బేసిన్లో 94 మంది అరెస్ట్..$64 మిలియన్ల ఆస్తులు సీజ్..!!
- July 09, 2025
యూఏఈ: అమెజాన్ బేసిన్లో పర్యావరణ నేరాలపై యూఏఈ ఉక్కుపాదం మోపింది. 94 మంది అనుమానితులను అరెస్టు చేయడంతోపాటు $64 మిలియన్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ఒక పోస్ట్లో ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తెలిపారు.ఆపరేషన్ గ్రీన్ షీల్డ్ లో భాగంగా అరెస్టులు జరిగాయని పేర్కొన్నారు.కొలంబియా, బ్రెజిల్, పెరూ,ఈక్వెడార్ల సమన్వయంతో యూఏఈ 14 రోజులపాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిందని తెలిపారు.
2023లో దుబాయ్లో జరిగిన COP28 వాతావరణ సమావేశంలో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) భాగస్వామ్యంతో యూఏఈ గ్లోబల్ ఇనిషియేటివ్, లా ఎన్ఫోర్స్మెంట్ ఫర్ క్లైమేట్ (I2LEC) కింద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ సంవత్సరం మే నెలలో యూఏఈ కొత్త వాతావరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2024లో అల్ వాత్బాలోని రక్షిత రిజర్వ్లోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులకు Dh165,000 జరిమానా విధించారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









