బహ్రెయిన్లో BD200 కంటే తక్కువ సంపాదిస్తున్న ప్రవాస కార్మికులు..!!
- July 09, 2025
మనామా: ప్రైవేట్ రంగంలో ప్రవాసులు, బహ్రెయిన్ కార్మికుల మధ్య పెరుగుతున్న ఆదాయ అంతరాన్ని సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ (SIO) ఇటీవలి నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఎక్కువ మంది విదేశీ కార్మికులు నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారని నివేదిక వెల్లడించింది.డేటా ప్రకారం..కేవలం 4% మంది ప్రవాసులు నెలకు BD1,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
2025 మొదటి త్రైమాసికం చివరి నాటికి 470,145 మంది బీమా ఉన్న ప్రవాస కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ వారిలో 71% మంది( దాదాపు 332,270 మంది) నెలకు BD200 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. బహ్రెయిన్లలో కేవలం 2% మంది (2,142 మంది) అత్యల్ప ఆదాయ వర్గంలో ఉన్నారు. అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఫురుషుల సంఖ్య 483 ఉండగా 1,659 మంది మహిళలు ఉన్నారు.
BD200 మరియు BD399 మధ్య సంపాదిస్తున్న ప్రవాసులు 64,000 మంది ఉన్నారు. వీరిలో పురుషులు దాదాపు 80% మంది ఉన్నారు. బహ్రెయిన్లలో దాదాపు మూడవ వంతు మంది ఈ ఆదాయ వర్గంలోకి వచ్చారు. దాదాపు 8% మంది ప్రవాసులు BD400 - BD599 మధ్య, 2% మంది మాత్రమే BD600 - BD799 మధ్య సంపాదిస్తున్నారు. BD800 నుండి BD999 వరకు కేవలం 1% మంది ప్రవాసులు మాత్రమే ఉన్నారు. అదే బహ్రెయిన్లలో 8% మంది ఉన్నారు. ఇక నెలకు BD1,000 కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారిలో 20,431 ప్రవాసులు, 22,790 మంది బహ్రెయిన్ వాసులు ఉన్నారు.
ఈ నివేదిక ప్రకారం.. ప్రవాస శ్రామిక శక్తిలో 89.6% మంది పురుషులు (421,722), కేవలం 11.5% మంది మహిళలు మాత్రమే ఉన్నారు. 66,822 మంది బహ్రెయిన్ పురుషులు ఉండగా, 37,636 మంది మహిళలు ఉన్నారు.
అదే సమయంలో బహ్రెయిన్ కార్మికులు నెలకు సగటున BD881 సంపాదిస్తుండగా, ప్రవాసులు సగటున BD271 మాత్రమే సంపాదిస్తున్నారు. బహ్రెయిన్ వాసులలో 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, సగటున BD1,732 సంపాదిస్తున్నారు. ప్రవాసులలో అత్యధికంగా సంపాదించేవారు 50–59 సంవత్సరాల వయస్సు గలవారు ఉండగా, సగటు జీతం BD664 ఉందని నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







