జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ లో ప్రారంభం..!!
- July 11, 2025
అబుదాబి: డిసెంబర్లో జాయెద్ నేషనల్ మ్యూజియం ప్రారంభం కానుంది. దీనిని యూఏఈ వ్యవస్థాపక పితామహుడు షేక్ జాయెద్ గౌరవార్థం నిర్మిస్తున్నారు. ఫోస్టర్ + పార్టనర్స్కు చెందిన ప్రిట్జ్కర్ బహుమతి గ్రహీత ఆర్కిటెక్ట్ లార్డ్ నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఈ మ్యూజియం డిజైన్ యూఏఈ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
సందర్శకులు 300,000 సంవత్సరాల మానవ చరిత్రను తెలుసుకునేలా రెండు అంతస్తులలో ఆరు శాశ్వత గ్యాలరీలను, అలాగే తాత్కాలిక ప్రదర్శన గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు. మ్యూజియం సేకరణలో యూఏఈ వ్యాప్తంగా సేకరించిన కళాఖండాలు ఉన్నాయి. ప్రపంచంలోని పురాతన సహజ ముత్యాలలో ఒకటైన అబుదాబి పెర్ల్ను ఇక్కడ చూడవచ్చు. అదే సమయంలో అరేబియా గల్ఫ్లో ముత్యాల వేట చరిత్రను తెలుసుకోవచ్చు. ప్రాచీన ఖురాన్ మాన్యుస్క్రిప్ట్లలో ఒకటైన బ్లూ ఖురాన్ ను ఇక్కడచూడవచ్చు. మ్యూజియం సేకరణలో పాలియోలిథిక్, నియోలిథిక్, కాంస్య , ఇనుప యుగం కళాఖండాలు ఉన్నాయని తెలిపారు.
“యూఏఈ జాతీయ మ్యూజియంగా, జాయెద్ నేషనల్ మ్యూజియం మన వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ వారసత్వం. ఇది ప్రజలపై, వారి నేర్చుకునే సామర్థ్యంలో ఐక్యత, జాతీయ విలువలను నిలబెట్టడంలో ఆయనకున్న అపరిమితమైన నమ్మకానికి నివాళి. భవిష్యత్ తరాలకు ఒక గుర్తింపుకు ఒక వెలుగు. ఈ సంస్థ మన కథను రాబోయే తరాలకు ముందుకు తీసుకువెళుతుంది.’’ అని అబుదాబిలోని సంస్కృతి, పర్యాటక శాఖ ఛైర్మన్ మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ తెలిపారు.
తాజా వార్తలు
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు







