డ్రైవర్‌కు షాకిచ్చిన కోర్టు.. Dh51,450 చెల్లించాలని ఆదేశం..!!

- July 16, 2025 , by Maagulf
డ్రైవర్‌కు షాకిచ్చిన కోర్టు.. Dh51,450 చెల్లించాలని ఆదేశం..!!

యూఏఈ: అబుదాబిలోని ఒక కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. సిగ్నల్ జంప్ చేస్తూ.. తను పనిచేసే కంపనీకి నష్టం చేసిన డ్రైవర్.. తన మాజీ యజమానికి Dh51,450 చెల్లించాలని ఆదేశించింది.  

అబుదాబి లేబర్ కోర్టు పత్రాల ప్రకారం.. కంపెనీ డ్రైవర్‌పై దావా వేసింది.  అతడు తరచూ చేసిన ఉల్లంఘనల కారణంగా జరిమానాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. క్లెయిమ్ తేదీ నుండి 5% ఆలస్య చెల్లింపు రుసుముతో పాటు, చట్టపరమైన ఖర్చులు, న్యాయవాది రుసుములను కూడా కంపెనీ అభ్యర్థించింది.  

మొత్తం Dh800 జీతంతో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న డ్రైవర్ సిగ్నల్ జంప్ చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని కంపెనీ వాదించింది. డ్రైవర్‌కు 3,000 దిర్హామ్‌ల జరిమానా విధించగా, కంపెనీ చివరికి 50,000 దిర్హామ్‌ల జరిమానాతో పాటు 1,450 దిర్హామ్‌ల రవాణా రుసుము చెల్లించింది. అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ, మాజీ ఉద్యోగి కంపెనీకి తిరిగి చెల్లించలేదని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com