షార్జాలో మహిళ మృతి.. భారత్ లో భర్తపై వరకట్న కేసు నమోదు..!!
- July 16, 2025
యూఏఈ: షార్జాలో ఒక మహిళ తన పసికందును చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని కలిచివేసింది. ఈ కేసు విషయమై కేరళలోని కుందార పోలీస్ స్టేషన్లో మృతురాలి భర్త, అతని కుటుంబంపై కేసు నమోదు చేశారు. భర్త కేరళలోని కొట్టాయంకు చెందినవాడు. అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలి తల్లి శైలజ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఆమె కుమార్తె గత కొన్ని సంవత్సరాలుగా వరకట్న వేధింపులతో పాటు మానసిక వేధింపులను ఎదుర్కొంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జూలై 8న షార్జాలోని వారి అపార్ట్మెంట్లో మహిళ, ఆమె ఒకటిన్నర సంవత్సరాల కుమార్తె చనిపోయి కనిపించారు. మృతురాలు గత ఐదు సంవత్సరాలుగా షార్జాలో నివసిస్తున్నారు. ఆమె భర్త విడాకుల కోసం ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడని , ఆమెను క్రమం తప్పకుండా శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, వైవాహిక జీవితం, మానసిక క్షోభ కారణంగా తను సూసైడ్ చేసుకుంటున్నట్లు రాసి ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని షార్జాకు చెందిన సామాజిక కార్యకర్త అబ్దుల్లా కమంపాలం వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!