కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టంతో మరణాలు తగ్గుదల..!!
- July 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సంబంధిత మరణాలలో గణనీయమైన తగ్గుదలని నివేదించింది. 2025 ప్రథమార్థంలో 94 మరణాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 143 మరణాలతో పోలిస్తే 49 తగ్గాయని తెలిపింది. ట్రాఫిక్ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు, రోడ్లపై ప్రమాదకరమైన ప్రవర్తనను అరికట్టడంలో సహాయపడ్డాయని తెలిపింది.
స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ కారణంగా ఈ తగ్గుదల నమోదైందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా అల్-జరిదా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాలు కొనసాగుతాయని తెలిపారు. ట్రాఫిక్ భద్రత అనేది ఉమ్మడి బాధ్యత అని అల్-ఎస్సా చెప్పారు. పౌరులు, నివాసితులు ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







