కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టంతో మరణాలు తగ్గుదల..!!
- July 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సంబంధిత మరణాలలో గణనీయమైన తగ్గుదలని నివేదించింది. 2025 ప్రథమార్థంలో 94 మరణాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 143 మరణాలతో పోలిస్తే 49 తగ్గాయని తెలిపింది. ట్రాఫిక్ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు, రోడ్లపై ప్రమాదకరమైన ప్రవర్తనను అరికట్టడంలో సహాయపడ్డాయని తెలిపింది.
స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ కారణంగా ఈ తగ్గుదల నమోదైందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా అల్-జరిదా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాలు కొనసాగుతాయని తెలిపారు. ట్రాఫిక్ భద్రత అనేది ఉమ్మడి బాధ్యత అని అల్-ఎస్సా చెప్పారు. పౌరులు, నివాసితులు ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!