కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టంతో మరణాలు తగ్గుదల..!!
- July 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సంబంధిత మరణాలలో గణనీయమైన తగ్గుదలని నివేదించింది. 2025 ప్రథమార్థంలో 94 మరణాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 143 మరణాలతో పోలిస్తే 49 తగ్గాయని తెలిపింది. ట్రాఫిక్ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు, రోడ్లపై ప్రమాదకరమైన ప్రవర్తనను అరికట్టడంలో సహాయపడ్డాయని తెలిపింది.
స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ కారణంగా ఈ తగ్గుదల నమోదైందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా అల్-జరిదా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాలు కొనసాగుతాయని తెలిపారు. ట్రాఫిక్ భద్రత అనేది ఉమ్మడి బాధ్యత అని అల్-ఎస్సా చెప్పారు. పౌరులు, నివాసితులు ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







