టాక్సీ ఛార్జీల కంటే చౌక.. విజ్ ఎయిర్ నిర్ణయంతో నిరాశ..!!
- July 16, 2025
యూఏఈ: దుబాయ్ నుండి అబుదాబికి టాక్సీ ఛార్జీ Dh250 నుండి Dh300 వరకు ఉంటుంది. కానీ చాలా మంది యూఏఈ నివాసితులు టాక్సి ఛార్జీలకంటే తక్కువకే ఫ్లైట్స్ టిక్కెట్స్ ను విజ్ ఎయిర్ అందిస్తూ మన్ననలు పొందింది. ఇది రూట్, సీజన్ ఆధారంగా Dh129 నుండి ప్రారంభమయ్యే వన్-వే టిక్కెట్లను అందించింది. అయితే, విజ్ ఎయిర్ సెప్టెంబర్ 1 నుండి అబుదాబి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో విదేశాలకు ప్రయాణించడానికి అత్యంత తక్కువ విమానయాన సంస్థ సేవల్లో ఒకదాన్ని కోల్పోవడం పట్ల చాలా మంది నివాసితులు నిరాశ చెందినట్లు తెలిపారు.
విజ్ ఎయిర్ ప్రయాణాన్ని చాలా తక్కువకే అందించిందని, తరచుగా అబుదాబి విమానాశ్రయానికి టాక్సీ ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణం కొనసాగించినట్లు దుబాయ్ నివాసి అయిన నోయెల్ అబ్రహం గుర్తుచేసుకున్నారు. “నేను దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో నివసిస్తున్నాను. నేను అబుదాబి విమానాశ్రయానికి టాక్సీ తీసుకుంటే, నాకు Dh200-250 ఖర్చవుతుంది. కానీ నేను తరచుగా విజ్ ఎయిర్లో బాకు లేదా ఇతర యూరోపియన్ నగరాల వంటి ప్రదేశాలకు కేవలం Dh180-190 కి వెళ్లగలిగాను.” అని నోయెల్ అన్నారు.
కాగా, కార్యకలాపాలను ముగించాలనే ఎయిర్లైన్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. “శీతాకాలం రావడంతో, చాలా మందికి నిస్సందేహంగా ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఊహించనిది. వ్యక్తిగతంగా, నేను ఈ సంవత్సరం జార్జియాను, వచ్చే సంవత్సరం అల్బేనియా, సెర్బియాను విజ్ ఎయిర్లోనే సందర్శించాలని అనుకున్నాను. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి తక్కువ ధర విమానయాన సంస్థ మరొకటి లేదు.” అని నోయెల్ అన్నారు.
గల్ఫ్ వెలుపల తన మొదటి పర్యటనకు వెళ్లే అవకాశాన్ని విజ్ ఎయిర్ ఇచ్చిందని డెయిరాలో నివసిస్తున్న లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ ఫాహిమ్ అర్మార్ గుర్తుచేసుకున్నారు. తాను విమాన ఛార్జీలను చూసి షాక్ అయ్యామని, తన స్నేహితులతో కలిసి టిక్కెట్లను బుక్ చేసుకున్నామని తెలిపారు. జార్జియాకు రౌండ్-ట్రిప్ టికెట్ ధర కేవలం Dh380 మాత్రమేనని.. ఆ ధర వల్ల మేమందరం వెళ్ళడానికి వీలు కలిగిందన్నారు. కాగా, విజ్ ఎయిర్ నిర్ణయం నిరాశ కలిగించిందని, తమ పర్యాటన షెడ్యూల్ ను మార్చుకోవల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







