టాక్సీ ఛార్జీల కంటే చౌక.. విజ్ ఎయిర్ నిర్ణయంతో నిరాశ..!!
- July 16, 2025
యూఏఈ: దుబాయ్ నుండి అబుదాబికి టాక్సీ ఛార్జీ Dh250 నుండి Dh300 వరకు ఉంటుంది. కానీ చాలా మంది యూఏఈ నివాసితులు టాక్సి ఛార్జీలకంటే తక్కువకే ఫ్లైట్స్ టిక్కెట్స్ ను విజ్ ఎయిర్ అందిస్తూ మన్ననలు పొందింది. ఇది రూట్, సీజన్ ఆధారంగా Dh129 నుండి ప్రారంభమయ్యే వన్-వే టిక్కెట్లను అందించింది. అయితే, విజ్ ఎయిర్ సెప్టెంబర్ 1 నుండి అబుదాబి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో విదేశాలకు ప్రయాణించడానికి అత్యంత తక్కువ విమానయాన సంస్థ సేవల్లో ఒకదాన్ని కోల్పోవడం పట్ల చాలా మంది నివాసితులు నిరాశ చెందినట్లు తెలిపారు.
విజ్ ఎయిర్ ప్రయాణాన్ని చాలా తక్కువకే అందించిందని, తరచుగా అబుదాబి విమానాశ్రయానికి టాక్సీ ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో ప్రయాణం కొనసాగించినట్లు దుబాయ్ నివాసి అయిన నోయెల్ అబ్రహం గుర్తుచేసుకున్నారు. “నేను దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో నివసిస్తున్నాను. నేను అబుదాబి విమానాశ్రయానికి టాక్సీ తీసుకుంటే, నాకు Dh200-250 ఖర్చవుతుంది. కానీ నేను తరచుగా విజ్ ఎయిర్లో బాకు లేదా ఇతర యూరోపియన్ నగరాల వంటి ప్రదేశాలకు కేవలం Dh180-190 కి వెళ్లగలిగాను.” అని నోయెల్ అన్నారు.
కాగా, కార్యకలాపాలను ముగించాలనే ఎయిర్లైన్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. “శీతాకాలం రావడంతో, చాలా మందికి నిస్సందేహంగా ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఊహించనిది. వ్యక్తిగతంగా, నేను ఈ సంవత్సరం జార్జియాను, వచ్చే సంవత్సరం అల్బేనియా, సెర్బియాను విజ్ ఎయిర్లోనే సందర్శించాలని అనుకున్నాను. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి తక్కువ ధర విమానయాన సంస్థ మరొకటి లేదు.” అని నోయెల్ అన్నారు.
గల్ఫ్ వెలుపల తన మొదటి పర్యటనకు వెళ్లే అవకాశాన్ని విజ్ ఎయిర్ ఇచ్చిందని డెయిరాలో నివసిస్తున్న లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ ఫాహిమ్ అర్మార్ గుర్తుచేసుకున్నారు. తాను విమాన ఛార్జీలను చూసి షాక్ అయ్యామని, తన స్నేహితులతో కలిసి టిక్కెట్లను బుక్ చేసుకున్నామని తెలిపారు. జార్జియాకు రౌండ్-ట్రిప్ టికెట్ ధర కేవలం Dh380 మాత్రమేనని.. ఆ ధర వల్ల మేమందరం వెళ్ళడానికి వీలు కలిగిందన్నారు. కాగా, విజ్ ఎయిర్ నిర్ణయం నిరాశ కలిగించిందని, తమ పర్యాటన షెడ్యూల్ ను మార్చుకోవల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







