శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- July 16, 2025
తిరుమల: తిరుమలలోని అన్నమయ్య భవన్ కు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో జూలై 22వ తేదిన భక్తులకు అందుబాటులోకి రానున్న నూతన శ్రీవాణి కేంద్రాన్ని అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆయన బుధవారం ఉదయం పరిశీలించారు.
ఈ సందర్భంగా కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా టీ, కాఫీ, పాలు, తాగునీరు, పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని భక్తులందరికీ తెలిసేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం ఏఎన్సీ, హెచ్వీసీ ఉప విచారణ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమలలోని ఫుడ్&వాటర్ ల్యాబ్ ను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్న పరీక్షల గురించి సిబ్బందితో ఆరా తీశారు. నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పగడ్భందీగా ఆహార, తాగునీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఈఈ సుబ్రమణ్యం, డిప్యూటీ ఈవో లు భాస్కర్,సోమన్నారాయణ, డీఈ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







