కువైట్ లో ప్రత్యేక తనిఖీలు.. 437 ఉల్లంఘనలు, 32మంది అరెస్ట్..!!
- July 18, 2025
కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మహబౌలా ప్రాంతంలో సమగ్ర భద్రత, ట్రాఫిక్ ప్రచారాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రజా భద్రతను పెంపొందించడానికి, శాంతిభద్రతలను నిర్ధారించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.
ట్రాఫిక్ వ్యవహారాలు , ఆపరేషన్స్ సెక్టార్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్తో కలిసి నిర్వహించిన ఈ ప్రచారంలో 437 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వివిధ చట్టపరమైన ఉల్లంఘనలకు సంబంధించి 32 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన తొమ్మిది మంది వ్యక్తులు, ఆరుగురు వాంటెడ్ వ్యక్తులతోపాటు గుర్తింపు పత్రాలు లేని నలుగురు వ్యక్తులు ఉన్నారు.
అలాగే, లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు అనుమానిత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు పరారీలో ఉన్న ఇద్దరిని గుర్తించి అరెస్ట్ చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో భద్రతా ప్రచారాలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అన్ని చట్టాలతోపాటు ట్రాఫిక్, నివాస నిబంధనలను పాటించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









