'కబాలి' నాణేలను విడుదల ...
- July 15, 2016
సూపర్స్టార్ రజినీకాంత్ 'కబాలి' చిత్రం రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ చిత్రం కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రజినీకాంత్ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీల ద్వారా సరఫరా చేయడానికి ఆ సంస్థఒప్పందం కుదుర్చుకుందట. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. 'కబాలి' నాణేలను విడుదల చేసిన కార్యక్రమంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 'ఈ వెండి నాణేలు 5 గ్రాములు(రూ. 350), 10 గ్రాములు(రూ. 700), 20 గ్రాములు(రూ. 1400) చొప్పున లభిస్తాయి. శుక్రవారం నుంచి ఈ నాణేలను బుక్ చేసుకోవచ్చు, కానీ చిత్రం విడుదల తర్వాతే ఇవి అందుతాయి' అని ముత్తూట్ అధికారి కెయూర్ షా తెలిపినట్లు సమాచారం.
పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన రాధికాఆప్టే నటించారు. ఈ నెల 22న 'కబాలి' ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







