జ్యురిక్ విమానాశ్రయంలో ‘ఎమిరేట్స్’ ప్రయాణికులకు కాళరాత్రి..!!
- July 21, 2025
యూఏఈ: జులై 19న రాత్రి సమయంలో దుబాయ్కు వెళ్లే ఎమిరేట్స్ విమానం EK086లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో కొంతమంది ప్రయాణికులు తమ విమానం సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యం కావడంతో జ్యూరిచ్ విమానాశ్రయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 300 మంది ప్రయాణికులలో కొందరికి హోటల్ వసతి కల్పించగా, సింగిల్-ఎంట్రీ స్కెంజెన్ వీసాలు ఉన్నవారు, విమానాశ్రయ టెర్మినల్ నుండి బయటకు వెళ్లలేకపోయారు. చాలా విమానాశ్రయ సౌకర్యాలు, రెస్టారెంట్లు రాత్రి 11 గంటలకు మూసివేయడంతో దాదాపు 20 మంది ప్రయాణికులు ఆహారం, సరైన విశ్రాంతి సౌకర్యాలు, సరైన సమాచారం కోసం గంటలపాటు వేచిచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
దుబాయ్కు చెందిన ఇరానియన్ ప్రవాసిని నెగిన్ జాఫారి తన స్నేహితురాలు సనాజ్తో యూరోపియన్ వేసవి హాలిడేస్ కోసం బుక్ చేసుకున్నారు. జ్యురిక్ విమానాశ్రయంలో 20 గంటలకు పైగా గడిపిన తర్వాత వారు నిరాశతో వెనుదిరారు . “రాత్రి 11 గంటల ప్రాంతంలో, విమానాశ్రయ లైట్లు ఆగిపోవడం ప్రారంభించాయి. అందరూ గందరగోళానికి గురయ్యారు. అప్పుడే విమానం సర్వీసులు రద్దు చేసినట్ల తెలిపారు. రాత్రంగా కాళరాత్రి అయిందని పలువురు ప్యాసింజర్లు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









