బిగ్ టికెట్ ఇ-డ్రా: Dh50,000 గెలుచుకున్న నలుగురు ప్రవాసులు..!!
- July 26, 2025
యూఏఈ: ఈ వారం బిగ్ టికెట్ ఇ-డ్రాలో నలుగురు అదృష్టవంతులైన ప్రవాసులు విజేతలుగా నిలిచారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఒక బంగ్లాదేశీయుడు ఉన్నాడు. వీరు ఒక్కొక్కరు Dh50,000 చొప్పున గెలుచుకున్నారు.
గత ఏడు సంవత్సరాలుగా దుబాయ్లో నివసిస్తున్న కేరళకు చెందిన 32 ఏళ్ల అజై కృష్ణకుమార్ జయన్, ఒక సంవత్సరం క్రితం సోషల్ మీడియా ద్వారా బిగ్ టికెట్ గురించి మొదటిసారి విన్నాడు. అప్పటి నుండి, అతను 10 మంది స్నేహితుల గ్రూపుతో కలిసి టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాడు. వచ్చిన నగదును గ్రూపు మొత్తం పంచుకుంటామని తెలిపారు.
హైదరాబాద్కు చెందిన 39 ఏళ్ల భద్రతా అధికారి సమీర్ అహ్మద్, ప్రస్తుతం సౌదీ అరేబియాలో గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం యూట్యూబ్లో ఒక ప్రమోషనల్ వీడియో ద్వారా బిగ్ టికెట్ గురించి తెలుసుకుని కొనుగొలు చేస్తున్నాడు. సమీర్ కూడా కొనసాగుతున్న బండిల్ ఆఫర్లో పాల్గొన్నాడు. దీని ద్వారా అతనికి 3 టిక్కెట్లు లభించాయి. అతని అదృష్ట విజయం ఉచిత టికెట్ నుండి వచ్చింది.ఇండియా నుండి వచ్చిన సుష్మిత, రెండు టిక్కెట్లను కొనుగోలు చేసి, కొనసాగుతున్న బండిల్ ఆఫర్లో భాగంగా ఒక అదనపు టికెట్ను ఉచితంగా పొందింది. 277-044870 నంబర్ ఉచిత టికెట్ ఆమెకు విజయాన్ని అందించింది.
మూడు వారపు ఈ-డ్రాలు ఇప్పటికే ముగిశాయి. ఆగస్టు 3న అబుదాబిలో ప్రత్యక్షంగా గ్రాండ్ ప్రైజ్ డ్రా జరగడానికి చివరి వారం మిగిలి ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







