హైదరాబాద్–బెంగళూరు, టికెట్ ధరలను భారీగా తగ్గించిన ఆర్టీసీ
- July 26, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు తగ్గాయి.ప్రయాణికుల సౌకర్యార్థం సంస్థ 16 నుంచి 30 శాతం వరకు రాయితీలు ప్రకటించింది.విజయవాడకు గరుడ ప్లస్ బస్సు ఛార్జీ రూ.635 నుంచి రూ.444కు తగ్గింది.గరుడ క్లాస్ ధర రూ.592 నుంచి రూ.438కు తగ్గింది.రాజధాని బస్సు టికెట్ ధర రూ.533 నుంచి రూ. 448గా నిర్ణయించారు.లగ్జరీ సూపర్ క్లాస్ ఛార్జీ రూ. 815 నుంచి రూ.685కు తగ్గించారు.
బెంగళూరు మార్గంలో ఆకర్షణీయ రాయితీలు
బెంగళూరుకు సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.946 నుంచి రూ.757కు తగ్గింది. లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ ఛార్జీ రూ.1,569 నుంచి రూ.1,177కి తగ్గించారు.బెర్త్-కమ్-సీటర్ ధర రూ. 1,203 నుంచి రూ. 903కి తగ్గింది.
ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తింపు
ఈ రాయితీలు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు సమానంగా వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు ఉపశమనం
బస్సు ఛార్జీలు తగ్గడంతో విజయవాడ, బెంగళూరు ప్రయాణికులకు మంచి ఉపశమనం లభించింది. టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







