హైదరాబాద్–బెంగళూరు, టికెట్ ధరలను భారీగా తగ్గించిన ఆర్టీసీ
- July 26, 2025
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు తగ్గాయి.ప్రయాణికుల సౌకర్యార్థం సంస్థ 16 నుంచి 30 శాతం వరకు రాయితీలు ప్రకటించింది.విజయవాడకు గరుడ ప్లస్ బస్సు ఛార్జీ రూ.635 నుంచి రూ.444కు తగ్గింది.గరుడ క్లాస్ ధర రూ.592 నుంచి రూ.438కు తగ్గింది.రాజధాని బస్సు టికెట్ ధర రూ.533 నుంచి రూ. 448గా నిర్ణయించారు.లగ్జరీ సూపర్ క్లాస్ ఛార్జీ రూ. 815 నుంచి రూ.685కు తగ్గించారు.
బెంగళూరు మార్గంలో ఆకర్షణీయ రాయితీలు
బెంగళూరుకు సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.946 నుంచి రూ.757కు తగ్గింది. లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ ఛార్జీ రూ.1,569 నుంచి రూ.1,177కి తగ్గించారు.బెర్త్-కమ్-సీటర్ ధర రూ. 1,203 నుంచి రూ. 903కి తగ్గింది.
ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తింపు
ఈ రాయితీలు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు సమానంగా వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు ఉపశమనం
బస్సు ఛార్జీలు తగ్గడంతో విజయవాడ, బెంగళూరు ప్రయాణికులకు మంచి ఉపశమనం లభించింది. టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!