మానవత్వానికి శతృవు తీవ్రవాదం

- July 16, 2016 , by Maagulf
మానవత్వానికి శతృవు తీవ్రవాదం



డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ సైఫ్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో ఉగ్రవాదులు దాడి జరిపిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తీవ్రవాదం అనేది మానవత్వానికి శతృవని ఆయన అభివర్ణించారు. దాడుల్లో వివిధ మతాలకు చెందినవారు చనిపోతున్నారనీ, ఉగ్రవాదానికి లక్ష్యం అంటూ లేదనడానికి ఇదే కారణమని ఆయన చెప్పారు. ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని క్షమించదని చెప్పారు షేక్‌ సైఫ్‌. అందరం కలిసి తీవ్రవాదాన్ని సంయుక్తంగా ఎదుర్కొని, దాన్ని అంతమొందించాల్సి ఉందని ఆయన వివరించారు. ఫెడరల్‌ నేషనల్‌ కౌన్సిల్‌ కూడా ఫ్రాన్స్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండించింది. ఎఫ్‌ఎన్‌సి స్పీకర్‌ డాక్టర్‌ అమాల్‌ అబ్దుల్లా అల్‌ కుబాసి, ఫ్రెంచ్‌ సెనేట్‌ ప్రెసిడెంట్‌ గెరార్డ్‌ లార్చర్‌ మరియు నేషనల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌ క్లాడె బర్టోలిన్‌కి రెండు లేఖల్ని సంతాపం తెలుపుతూ పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com