ముంబైని ముంచెత్తనున్న భారీ వర్షాలు: IMD హెచ్చరిక
- July 26, 2025
ముంబై: భారీ వర్షాలు ముంబై నగరాన్ని మళ్లీ ముంచెత్తనున్నాయి. ఇప్పటికే ముంబై, థానే, రాయ్గడ్, పుణె, సతారా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.సిటీలో జూలై 27వ తేదీ ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తన హెచ్చరికలో వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ముంబై తీరం వెంట సుమారు 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీయనున్నది. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లోనే వర్ష బీభత్సం కొనసాగనున్నది.
ప్రజలు ఎవరూ బయట తిరగవద్దు అని ఐఎండీ పేర్కొన్నది. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సమీప జిల్లాలకు కూడా ఈ అలర్ట్ ఇచ్చారు. ఆదివారం ఉదయం వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగనున్నది. రాయ్గడ్ జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం ఉదయం వరకు మాత్రం పాల్గర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద అలలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వర్షం వల్ల ఈస్ట్రన్ ఎక్స్ప్రెస్ వే జామైంది.రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు బీఎంసీ వర్కర్లు రంగంలోకి దిగారు.
భారతదేశంలో అతి పెద్ద వరద ఏది?
1954లో గంగా నదిపై ఇప్పటివరకు సంభవించిన అత్యధిక వరద 72 900 m J s”‘ గా నమోదైంది. 1000 కిమీ 2 కంటే తక్కువ ఉన్న ప్రాంతాలకు, భారతదేశంలో అత్యధిక వరదలు తీవ్రతలో చాలా తక్కువగా ఉంటాయి.
ముంబైలో ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతం ఏది?
భారీ వర్షాకాలంలో పోవై ప్లాజా మరియు హిరానందని ఆసుపత్రి కింద ఉన్న ప్రాంతాలు నీటితో నిండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ముంబైలో అతిపెద్ద వరద ఎప్పుడు వచ్చింది?
జూలై 26, 2005 న, మధ్యాహ్నం 2:00 గంటల ప్రాంతంలో, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం తీవ్రమైన తుఫాను మరియు దాని తరువాత వచ్చిన వరదలతో అతలాకుతలమైంది. శాంటాక్రూజ్లోని భారత వాతావరణ శాఖ (IMD) స్టేషన్ 944 మిల్లీమీటర్లు (37.2 అంగుళాలు) నమోదైంది. ముంబైలో ఇది రికార్డు స్థాయిలో అత్యంత వర్షపాతం నమోదైన రోజు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









