కోర్టు పై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
- July 26, 2025
ఇరాన్: ఆగ్నేయ ఇరాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా కోర్టుపైనే కాల్పులు జరిపారు. ఇరాన్ స్థానిక సమయం ప్రకారం శుక్రవారం సిస్తాన్-బలూచెస్తాన్ ప్రావిన్స్ రాజధాని జహెదాన్లోని కోర్టు బిల్డింగ్పై ఉగ్రవాదులు దాడి చేశారు.తుపాకులతో కాల్పులు జరిపారు.ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు.ఈ ప్రాంతంలో సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ ఈ దాడికి బాధ్యత హిస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.కోర్టు భవనం చుట్టూ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఇందులో ఆత్మాహుతి దాడి జరిగి ఉండవచ్చనిఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాల్పులకు కారణాలు
సెంట్రల్ జహెదాన్లోని కోర్టుహాల్ సముదాయంలో న్యాయమూర్తుల గదుల్లోకి ముష్కరులు చొరబడ్డారు.కనీసం 13 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఎ ప్రకటించింది.బలూచ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న మానవ హక్కుల సంస్థ
వాచ్ఎఎల్టిఎస్ హెచ్,ఈ దాడిలో అనేక మంది జుడిషియల్ ఆఫీసర్లు, భద్రతా సిబ్బంది మరణించారని లేదా గాయపడ్డారని చెప్పింది.
ఇరాన్లో మంచు పడుతుందా?
అవును, ఇరాన్లో కొన్ని ప్రాంతాలలో మంచు పడుతుంది.ముఖ్యంగా ఉత్తర మరియు పడమర ప్రాంతాలలోని పర్వత ప్రాంతాలలో శీతాకాలంలో తరచుగా మంచు కురుస్తుంది.అల్బొర్జ్ జాగ్రోస్ పర్వత శ్రేణులు మంచు కోసం ప్రసిద్ధి గాంచినవి.
ఇరాన్ ప్రధాన ఎగుమతి ఉత్పత్తి ఏమిటి?
ఇరాన్ యొక్క ప్రధాన ఎగుమతులు చమురు మరియు ప్రాకృతిక వాయువు. ఇవి దేశానికి వచ్చే ఎగుమతి ఆదాయంలో సుమారు 82 శాతం వరకు వాటా కలిగి ఉంటాయి.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







