ఇండియాకు ట్రంప్ షాక్..
- July 30, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చారు.ఇండియా పై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ లో ప్రకటించారు. దీంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియా పై పెనాల్టీ కూడా విధించారు ట్రంప్.
‘ఇండియా అమెరికాకి చాలా కాలం నుంచి మంచి మిత్రుడే.ఆ దేశంతో చాలా తక్కువ బిజినెస్ చేశాం. ఎందుకంటే వారి టారిఫ్ లు చాలా ఎక్కువ.ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టారిఫ్ లు ఇండియా అమలు చేస్తుంది. అలాగే, ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.
ఓ వైపు ప్రపంచం మొత్తం రష్యా..యుక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని చెబుతుంది. కానీ అంత మంచేం జరగడం లేదు. కాబట్టి ఇండియా మీద 25శాతం టారిఫ్ లు విధిస్తున్నాం. అలాగే, రష్యా నుంచి ఆయుధాలు, ఆయిల్ కొంటున్నందుకు పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







