ఇండియాకు ట్రంప్ షాక్..
- July 30, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చారు.ఇండియా పై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ లో ప్రకటించారు. దీంతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ఇండియా పై పెనాల్టీ కూడా విధించారు ట్రంప్.
‘ఇండియా అమెరికాకి చాలా కాలం నుంచి మంచి మిత్రుడే.ఆ దేశంతో చాలా తక్కువ బిజినెస్ చేశాం. ఎందుకంటే వారి టారిఫ్ లు చాలా ఎక్కువ.ఒక రకంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టారిఫ్ లు ఇండియా అమలు చేస్తుంది. అలాగే, ఇండియా తన మిలటరీ ఎక్విప్ మెంట్ లో అత్యధిక భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి అత్యంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా, చైనా ఉన్నాయి.
ఓ వైపు ప్రపంచం మొత్తం రష్యా..యుక్రెయిన్ మీద యుద్ధం ఆపాలని చెబుతుంది. కానీ అంత మంచేం జరగడం లేదు. కాబట్టి ఇండియా మీద 25శాతం టారిఫ్ లు విధిస్తున్నాం. అలాగే, రష్యా నుంచి ఆయుధాలు, ఆయిల్ కొంటున్నందుకు పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









