టీసీఎస్ లేఆఫ్స్ వేళ..ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రకటన
- July 30, 2025
టీసీఎస్లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన నియామక వ్యూహాన్ని ప్రకటించింది.ఇందులో భాగంగా సంస్థ ఈ ఏడాది దాదాపు 20,000 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే లక్ష్యం వేసుకున్నట్లు వెల్లడించింది. ఇది ఉన్నత విద్యాసంస్థల నుంచి సరికొత్త టాలెంట్ను తీసుకోవాలన్న దృష్టితో తీసుకున్న నిర్ణయం. టెక్నాలజీ, డిజిటల్ సేవలు, డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కంపెనీ ఈ నియామకాలను చేపట్టనుంది.
ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.ఓ జాతీయ మీడియాతో ఇన్ఫీ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే భారీగా హైరింగ్కు సిద్ధమవుతున్నామని సీఈఓ తెలిపారు.‘ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం.మొత్తం 2025 సంవత్సరానికి 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని భావిస్తున్నాం. కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ మార్పులు, తదితర రంగాల్లో ఇన్ఫోసిస్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఇప్పటి వరకు సంస్థ దాదాపు 2.75 లక్షల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో డిజిటల్, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చింది’ అని సీఈఓ వెల్లడించారు.
ఇన్ఫోసిస్ యజమాని ఎవరు?
నాగవర రామారావు నారాయణ మూర్తి (జననం 20 ఆగస్టు 1946) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మరియు పదవీ విరమణ చేసి చైర్మన్ ఎమెరిటస్ అయ్యే ముందు కంపెనీకి చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), అధ్యక్షుడు మరియు చీఫ్ మెంటర్గా పనిచేశారు.
ఇన్ఫోసిస్ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఇన్ఫోసిస్ దాని ఐటీ కన్సల్టింగ్ మరియు అవుట్సోర్సింగ్ సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు సేవలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడే గ్లోబల్ డెలివరీ మోడల్ను రూపొందించిన మొదటి సంస్థ ఇది.
ఇన్ఫోసిస్ ఏ దేశానికి చెందినది?
ఇన్ఫోసిస్ అనేది 300,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల నెట్వర్క్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాలలోని కంపెనీలకు డిజిటల్ సేవలు మరియు కన్సల్టింగ్ను అందించే ప్రపంచవ్యాప్త సంస్థ. దీనిని భారతదేశంలోని పూణేలో ఏడుగురు ఇంజనీర్ల బృందం 1981లో స్థాపించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







