టీసీఎస్ లేఆఫ్స్ వేళ..ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రకటన
- July 30, 2025
టీసీఎస్లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన నియామక వ్యూహాన్ని ప్రకటించింది.ఇందులో భాగంగా సంస్థ ఈ ఏడాది దాదాపు 20,000 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే లక్ష్యం వేసుకున్నట్లు వెల్లడించింది. ఇది ఉన్నత విద్యాసంస్థల నుంచి సరికొత్త టాలెంట్ను తీసుకోవాలన్న దృష్టితో తీసుకున్న నిర్ణయం. టెక్నాలజీ, డిజిటల్ సేవలు, డేటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కంపెనీ ఈ నియామకాలను చేపట్టనుంది.
ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.ఓ జాతీయ మీడియాతో ఇన్ఫీ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 17 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కంపెనీ ఎక్కువగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.ఇందులో భాగంగానే భారీగా హైరింగ్కు సిద్ధమవుతున్నామని సీఈఓ తెలిపారు.‘ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే 17 వేల మందికి పైగా నియమించుకున్నాం.మొత్తం 2025 సంవత్సరానికి 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని భావిస్తున్నాం. కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ మార్పులు, తదితర రంగాల్లో ఇన్ఫోసిస్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టింది. ఇప్పటి వరకు సంస్థ దాదాపు 2.75 లక్షల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో డిజిటల్, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చింది’ అని సీఈఓ వెల్లడించారు.
ఇన్ఫోసిస్ యజమాని ఎవరు?
నాగవర రామారావు నారాయణ మూర్తి (జననం 20 ఆగస్టు 1946) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, మరియు పదవీ విరమణ చేసి చైర్మన్ ఎమెరిటస్ అయ్యే ముందు కంపెనీకి చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), అధ్యక్షుడు మరియు చీఫ్ మెంటర్గా పనిచేశారు.
ఇన్ఫోసిస్ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఇన్ఫోసిస్ దాని ఐటీ కన్సల్టింగ్ మరియు అవుట్సోర్సింగ్ సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు సేవలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడే గ్లోబల్ డెలివరీ మోడల్ను రూపొందించిన మొదటి సంస్థ ఇది.
ఇన్ఫోసిస్ ఏ దేశానికి చెందినది?
ఇన్ఫోసిస్ అనేది 300,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల నెట్వర్క్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాలలోని కంపెనీలకు డిజిటల్ సేవలు మరియు కన్సల్టింగ్ను అందించే ప్రపంచవ్యాప్త సంస్థ. దీనిని భారతదేశంలోని పూణేలో ఏడుగురు ఇంజనీర్ల బృందం 1981లో స్థాపించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









