ఫీల్డ్ అసిస్టెంట్లకు (FA) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
- July 30, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గతంలో వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించబడిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం పునర్విచారణ చేస్తోంది.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులకు సంబంధిత సర్క్యులర్ను రద్దు చేసి, తిరిగి నియామక ప్రక్రియపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం చాలా కాలంగా తిరిగి ఉద్యోగాల్లోకి వచ్చే ఆశతో ఎదురుచూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లలో ఆనందం నింపింది.
గత ప్రభుత్వం హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లపై పనితీరు లోపాలు, హాజరు అక్రమాలు, అవినీతి ఆరోపణలు వంటి కారణాలతో చర్యలు తీసుకున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కూడా తొలగింపులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిణామాల్లో మంత్రి సీతక్క ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ నాయకులతో సమావేశమై, వారి సమస్యలపై చర్చించారు. వేతనాల్లో అసమానతలను సరిదిద్దుతూ ఒకే విధమైన జీతాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచనుంది.
ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీలు, బీమా సదుపాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాల కోసం బీమా కంపెనీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ పథకాలు ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించనున్నాయి.ప్రభుత్వ ఈ చర్యల పై ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









