తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు
- August 01, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా ఏర్పాటు కానున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 4 కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 32ను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంజనీరింగ్ కాలేజీల్లో బిటెక్-సిఎస్ఈ, బిటెక్-సిఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), బిటెక్- కంప్యూటర్ సైన్స్ అండ్(CSE) ఐటీ, బిటెక్-డాటా సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్స రం నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నట్టు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున 240 సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఎప్ సెట్- 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో మూడో ఫేజ్లో తెలంగాణ యూనివర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!







