తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు
- August 01, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా ఏర్పాటు కానున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 4 కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 32ను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంజనీరింగ్ కాలేజీల్లో బిటెక్-సిఎస్ఈ, బిటెక్-సిఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), బిటెక్- కంప్యూటర్ సైన్స్ అండ్(CSE) ఐటీ, బిటెక్-డాటా సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్స రం నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నట్టు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున 240 సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఎప్ సెట్- 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో మూడో ఫేజ్లో తెలంగాణ యూనివర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









