తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు
- August 01, 2025
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.తెలంగాణ యూనివర్సిటీలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా ఏర్పాటు కానున్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 4 కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో ఎంఎస్ నంబర్ 32ను విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంజనీరింగ్ కాలేజీల్లో బిటెక్-సిఎస్ఈ, బిటెక్-సిఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), బిటెక్- కంప్యూటర్ సైన్స్ అండ్(CSE) ఐటీ, బిటెక్-డాటా సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్స రం నుంచి అడ్మిషన్లు తీసుకోనున్నట్టు విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున 240 సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఎప్ సెట్- 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో మూడో ఫేజ్లో తెలంగాణ యూనివర్సిటీకి మంజూరైన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









