ఈ-సిగరెట్లు,వేప్ల పై నిషేధం..చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్..!!
- August 03, 2025
మనామా: ఎలక్ట్రానిక్ స్మోకింగ్ పరికరాల ప్రమాదాల నుండి యువతను రక్షించే దిశగా బహ్రెయిన్ త్వరలో ఒక ప్రధాన అడుగు వేయనుంది. రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఎలక్ట్రానిక్ షిషా , ఈ-సిగరెట్లు (వేప్లు) అమ్మకాన్ని నిషేధించే ముసాయిదా చట్టంపై చర్చిస్తామని ఎంపీ జలాల్ కజెం అల్-మహ్ఫౌద్ వెల్లడించారు. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లలో వేపింగ్కు సంబంధించిన పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడం ఈ ప్రతిపాదన లక్ష్యం అని అల్-మహ్ఫౌద్ అన్నారు. ఆకర్షణీయమైన రుచులు, సోషల్ మీడియా ప్రమోషన్లు ఈ ఉత్పత్తులను యువతలో బాగా ప్రాచుర్యం పొందాయని, ఇవి సాంప్రదాయ సిగరెట్లకు "సురక్షితమైన" ప్రత్యామ్నాయం అనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాయని ఆయన పేర్కొన్నారు.
వీటి అమ్మకాలను కఠినంగా పర్యవేక్షించాలని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా ఇ-సిగరెట్లను మార్కెటింగ్ చేయడాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలలో, అలాగే కెనడా, భారతదేశం, సింగపూర్ వంటి దేశాలలో విజయవంతమైన నిషేధాల నుండి పాఠాలు నేర్చుకోవాలని కూడా ఆయన సూచించారు.ఆరోగ్య అధికారులు, పాఠశాలలో వేపింగ్ ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని ఎంపీ కోరారు. ఆన్లైన్ ప్రమోషన్ను నిషేధించడం, అమ్మకాల కేంద్రాలను నియంత్రించడం వంటి కఠినమైన చట్టాలను రూపొందించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







