ప్రజల్లో పఠానాసక్తిని పెంపొందించేందుకు ‘పేజ్ క్లబ్’ అద్వితీయ కార్యక్రమం
- August 03, 2025
విజయవాడ: విజ్ఞాన సముపార్జనతో పాటు,మనో వికాసానికి పుస్తక పఠనం ఎంతో అవసరం.నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనం క్రమక్రమంగా కనుమరుగైపోతోంది.పుస్తక పఠనమంటేనే అదో ప్రహసనంగా భావించబడుతున్న పరిస్థితుల్లో కొందరు చిన్నారుల సంకల్పం పుస్తక పఠన మహోద్యమంగా మారింది.ప్రజల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన పేజ్ క్లబ్..అబాలగోపాలన్నీ ఒక్కచోటికి చేర్చి పుస్తకం పట్టేలా చేసింది.పేజ్ క్లబ్ ఆధ్వర్యంలో పటమట ఫన్ టైమ్స్ క్లబ్ నందు ఆదివారం జరిగిన ఈ అద్వితీయ కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని పుస్తక పఠనం చేశారు.చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు, విద్యార్థుల నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తుల వరకు..అందరూ ఒకే వేదిక పైకి వచ్చి పుస్తక పఠనం కావించారు. ప్రభాత సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పుస్తక పఠన వెలుగులను ప్రస్ఫుటంగా ప్రసరింపజేసింది.పుస్తక పఠనం పట్ల చైతన్య స్ఫూర్తిని కలిగించిన ‘పేజ్ క్లబ్’కు ఏడాది క్రిందట అంకురార్పణ జరిగింది.పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరికీ అలవాటు చేయాలనే సంకల్పంతో, ప్రస్తుతం 11, 12 గ్రేడ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ‘పేజ్ క్లబ్’కు రూపకల్పన చేశారు. పుస్తక పఠనం ఆవశ్యకతను తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు,వాణిజ్య సముదాయాలు, కర్మాగారాల్లో పుస్తక పఠన కార్యక్రమాలను నిర్వహించారు.స్మార్ట్ ఫోన్ యుగంలో కనుమరుగైపోయిన పుస్తక పఠనాసక్తిని పునరుద్ధరించడం కోసం ‘పేజ్ క్లబ్’ మొక్కవోని పట్టుదలతో శ్రమించింది.వారి ప్రయత్నం ఫలించి, ఆదివారం నిర్వహించిన సామూహిక పుస్తక పఠనం విజయవంతమైంది.పేజ్ క్లబ్ ఆవిష్కర్తలైన విహాన్ సాయి వేములపల్లి, ఈషాన్వి నిమ్మగడ్డ, జైదేవ్ చౌదరి అవిర్నేని, మోక్షిత్, రోనక్ బగ్రేచాల స్వప్నం ఫన్ టైమ్స్ క్లబ్ వేదికగా సాకారమైంది.పేజ్ క్లబ్ చేపట్టిన పుస్తక పఠనోద్యమానికి వివిధ వర్గాల వారి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.తమ గృహ సముదాయాల్లో, కార్యాలయాల్లో పుస్తక పఠన కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ‘పేజ్ క్లబ్’ నిర్వాహకులను పలువురు స్వాగతించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







