ఏటీఎంలలో రూ.500 నోట్లు బంద్…
- August 03, 2025
న్యూ ఢిల్లీ: వాట్సాప్ గ్రూపుల్లో ఇటీవల ఓ సందేశం బాగా వైరల్ అవుతోంది. రాష్ట్రపతి ఆమోదంతో RBI ఒక కీలక నిర్ణయం తీసుకుంది.2025 సెప్టెంబర్ 30నాటికి ఏటీఎంల ద్వారా రూ. 500 నోట్లు ఇవ్వడం ఆపేస్తుంది.తరువాత ATMలలో కేవలం ₹100, ₹200 నోట్లే ఉంటాయి. అని ఆ సందేశం పేర్కొంటోంది.దీనికి తోడు–“2026 మార్చి నాటికి 90% ATMలు ఈ మార్పును అనుసరిస్తాయి” అని కూడా అందులో ఉంది.ఈ ఫార్వర్డ్ చూసి చాలామంది ఏకంగా బ్యాంకుకు పరుగులు పెట్టారు.కొందరు తమ వద్ద ఉన్న ₹500 నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించారు. అసలు విషయం ఏమిటో తెలీక గందరగోళంలో పడిపోయారు.
ఇలాంటి సందేశాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) – ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. RBI నుంచి అలాంటి ఏమీ ఉత్తర్వులు రాలేదని వెల్లడించింది.ఏటీఎంల నుంచి రూ.500 నోట్లు ఆపేయాలన్నది వదంతి మాత్రమే.ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకండి.₹500 నోట్లు చెల్లుబాటు అవుతూనే ఉంటాయి. అని PIB స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ‘ఎక్స్’ (పూర్వం ట్విట్టర్) వేదికలో ఓ పోస్టు కూడా చేసింది.
ఇది మొట్టమొదటి సారి కాదు. గతంలోనూ ఇటువంటి వదంతులు వైరల్ అయ్యాయి. అప్పుడూ PIB చెదరగొట్టింది. అయినా, కొన్ని వారాలకే మరో వేరియేషన్లో కొత్తగా ప్రచారం మొదలైంది. ఇదే తరహా అవాస్తవ సమాచారాన్ని వెదజల్లడం ద్వారా ప్రజలను కలవరపెట్టే ప్రయత్నం జరుగుతోందని అధికారులు భావిస్తున్నారు.
కరెన్సీకి సంబంధించిన ఏదైనా సమాచారం రావడం, లేదా వదంతి వినిపించినప్పుడు వెంటనే నమ్మకండి. ముందుగా RBI అధికారిక వెబ్సైట్ చూడండి.లేదా PIB ఫ్యాక్ట్ చెక్ ఖాతా చూసి నిజమెంటో తెలుసుకోండి.సోషల్ మీడియా ఫార్వర్డ్లను నిజమని అనుకోవడం వల్ల నష్టం వాటిల్లే అవకాశాలుంటాయి.ఇప్పటికే RBI ప్రకటించిన ఏ విధమైన మార్పూ లేదు.ATMలు గతంలాగే ₹500 నోట్లు కూడా ఇస్తూనే ఉంటాయి.వాటిని నిలిపివేస్తారన్న మాటలో ఏమాత్రం నిజం లేదు. అలాంటి వార్తలు వ్యాపించినా–అది నిజమా కాదా అనేది తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
ఈ రోజుల్లో సోషల్ మీడియా వేగంగా ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోంది. వాటిని అడ్డుకోవడం మనందరి బాధ్యత. ఒక చిన్న సందేశం కూడా పెద్దగా కల్లోలం సృష్టించవచ్చు. అందుకే – ఎప్పుడూ అధికారిక వర్గాల మాటే నమ్మండి.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









