కేంబ్రిడ్జ్ పార్క్లో సౌదీ విద్యార్థి పై కత్తిపోట్లు, మృతి..!!
- August 04, 2025
మనామా: శుక్రవారం రాత్రి కేంబ్రిడ్జ్కు దక్షిణంగా ఉన్న ఒక పార్కులో కత్తిపోట్లకు గురై సౌదీ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు మొహమ్మద్ యూసఫ్ అల్ ఖాసిమ్ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తన నివాసానికి తిరిగి వెళుతుండగా దాడి జరిగిందన్నారు. అతని మెడకు తీవ్ర గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మరణించాడని తెలిపారు.
కేంబ్రిడ్జ్లోని EF ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్ ఈ విషాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. "శుక్రవారం సాయంత్రం మా విద్యార్థుల్లో ఒకరు విషాదకర రీతిలో మరణించాడు. దీనికి మేము చాలా బాధపడ్డాము" అని పాఠశాల తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి కేంబ్రిడ్జ్షైర్ పోలీసులు 21, 50 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన లేదా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైనా తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







