కేంబ్రిడ్జ్ పార్క్లో సౌదీ విద్యార్థి పై కత్తిపోట్లు, మృతి..!!
- August 04, 2025
మనామా: శుక్రవారం రాత్రి కేంబ్రిడ్జ్కు దక్షిణంగా ఉన్న ఒక పార్కులో కత్తిపోట్లకు గురై సౌదీ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు మొహమ్మద్ యూసఫ్ అల్ ఖాసిమ్ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తన నివాసానికి తిరిగి వెళుతుండగా దాడి జరిగిందన్నారు. అతని మెడకు తీవ్ర గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మరణించాడని తెలిపారు.
కేంబ్రిడ్జ్లోని EF ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్ ఈ విషాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. "శుక్రవారం సాయంత్రం మా విద్యార్థుల్లో ఒకరు విషాదకర రీతిలో మరణించాడు. దీనికి మేము చాలా బాధపడ్డాము" అని పాఠశాల తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి కేంబ్రిడ్జ్షైర్ పోలీసులు 21, 50 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన లేదా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైనా తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









