కేంబ్రిడ్జ్ పార్క్లో సౌదీ విద్యార్థి పై కత్తిపోట్లు, మృతి..!!
- August 04, 2025
మనామా: శుక్రవారం రాత్రి కేంబ్రిడ్జ్కు దక్షిణంగా ఉన్న ఒక పార్కులో కత్తిపోట్లకు గురై సౌదీ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు మొహమ్మద్ యూసఫ్ అల్ ఖాసిమ్ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తన నివాసానికి తిరిగి వెళుతుండగా దాడి జరిగిందన్నారు. అతని మెడకు తీవ్ర గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మరణించాడని తెలిపారు.
కేంబ్రిడ్జ్లోని EF ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్ ఈ విషాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. "శుక్రవారం సాయంత్రం మా విద్యార్థుల్లో ఒకరు విషాదకర రీతిలో మరణించాడు. దీనికి మేము చాలా బాధపడ్డాము" అని పాఠశాల తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి కేంబ్రిడ్జ్షైర్ పోలీసులు 21, 50 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన లేదా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైనా తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









