కేంబ్రిడ్జ్ పార్క్లో సౌదీ విద్యార్థి పై కత్తిపోట్లు, మృతి..!!
- August 04, 2025
మనామా: శుక్రవారం రాత్రి కేంబ్రిడ్జ్కు దక్షిణంగా ఉన్న ఒక పార్కులో కత్తిపోట్లకు గురై సౌదీ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు మొహమ్మద్ యూసఫ్ అల్ ఖాసిమ్ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తన నివాసానికి తిరిగి వెళుతుండగా దాడి జరిగిందన్నారు. అతని మెడకు తీవ్ర గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మరణించాడని తెలిపారు.
కేంబ్రిడ్జ్లోని EF ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్ ఈ విషాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. "శుక్రవారం సాయంత్రం మా విద్యార్థుల్లో ఒకరు విషాదకర రీతిలో మరణించాడు. దీనికి మేము చాలా బాధపడ్డాము" అని పాఠశాల తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి కేంబ్రిడ్జ్షైర్ పోలీసులు 21, 50 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన లేదా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైనా తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









