ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను పరిశీలించిన టిటిడి ఛైర్మెన్
- August 06, 2025
తిరుపతి: ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్ నాయుడు ఆదేశించారు.మహిళా జూనియర్ కళాశాల జేఈవో వి.వీరబ్రహ్మం, టిటిడి బోర్డు మెంబర్ జి.భానుప్రకాష్ రెడ్డి కలిసి బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ, మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.కళాశాలలోని సమస్యలను టిటిడి జేఈవో, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.విద్యార్థినులు చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు.అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు.
ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని,వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్,ఈ-లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు టిటిడి ఛైర్మెన్ సూచించారు.
అంతకుముందు టిటిడి ఛైర్మెన్ బీ.ఆర్ నాయుడు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, వంట గది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు.అటు తరువాత విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిఈవో వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా.సి.భువనేశ్వరి, ఎస్.ఈ మనోహరం తదితరం అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!









