ట్రంప్ టారీఫ్స్ తో చేతులెత్తేసిన అమెరికా పెద్ద కంపెనీలు
- August 08, 2025
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే యుద్ధానికి సహాయం చేస్తున్నారు అనే నెపంతో భారత్ మీద 50 శాతం సుంకాలను విధించింది అమెరికా.ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు.ఈ నెల 27 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఇది జరిగి రెండు రోజులు అవుతోంది. అయితే ఈ టారీఫ్ ఎఫెక్ట్ అప్పుడే మార్కెట్ల మీద పడింది. ట్రంప్ పెంచిన సుంకాల కారణంగా అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. దీంతో అమెరికా ప్రజలపై భారం పెరగనుంది.
ట్రంప్ విధించిన అదనపు సుంకాల వలన ప్రభావితమయ్యే వస్తువుల్లో దుస్తులు ఒకటి. భారతదేశ వస్త్ర పరిశ్రమను ఈ సుంకాలు గట్టిగా దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు మన దేశం నుంచి ఏటా సుమారు 5.6 బిలియన్ డాలర్ల విలువైన రెడీమేడ్ దుస్తులు ఎగుమతి అవుతాయి. భారత వస్త్రాలు, దుస్తులకు యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం . మార్చి 2025 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో మన దేశం 28 శాతం వాటాను కలిగి ఉంది. దీని మొత్తం విలువ $36.61 బిలియన్లు. ఇప్పుడు భారత్పై ఇతర ఆసియా దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ కంటే ఎక్కువ సుంకాలు పడుతున్నాయి.
అనుకున్నట్టుగానే భారత వస్త్ర పరిశ్రమ మీద అప్పుడే దెబ్బ పడింది. ట్రంప్ విధించిన టారీఫ్ ల భయంతో దిగుమతులకు ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుందని అక్కడి బడా కంపెనీలు భయపడుతున్నాయి. దీని కారణంగా స్టాక్ పంపించొద్దు అంటూ వాల్ మార్ట్, అమెజాన్, గ్యాప్, టార్గెల్ లాంటి పెద్ద కంపెనీలు భారత్ నుంచి స్టాక్ పంపించొద్దని టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ పెడుతున్నారు. తదుపరి నోటీసులు వచ్చేవరకూ సరుకులను నిలిపివేయాలని చెప్పారు. కొనుగోలుదారులు ఖర్చు భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడటం లేదని కంపెనీలు చెబుతున్నాయి.
సమాఖ్య ప్రభుత్వం వసూలు చేసే దిగుమతులపై పన్నులు అయిన సుంకాలు సాధారణంగా ఖర్చులను పెంచుతాయి, అయితే ఆ పెరిగిన ధరల భారాన్ని వ్యాపారాలు లేదా వినియోగదారులు చివరికి భరిస్తారా అనే దానిపై ఆర్థికవేత్తలలో కొంత చర్చ జరుగుతోంది.
సుంకాలు ధరలను పెంచవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దీనికి అంగీకరించడం లేదు: గురువారం ముందు ఇప్పటికే అమలులో ఉన్న సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం నెమ్మదిగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









