'శివ' త్వరలో తెలుగులో రీ-రిలీజ్
- August 11, 2025
శివ రీ-రిలీజ్ టీజర్ ఆగస్టు 14న విడుదల కానున్న కూలీతో వస్తోంది. ఆడియన్స్ డాల్బీ అట్మోస్లో 4 కె విజువల్స్తో శివ కొత్త సౌండ్, విజువల్ ని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
ఇండియన్ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన శివ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సారి సౌండ్ మొత్తం హై ఎండ్ AI టెక్నాలజీతో రీ–డిజైన్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివా తన రా ఇంటెన్సిటీ, రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్తో సినిమాకు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. CNN–IBN టాప్ 100 ఇండియన్ ఫిల్మ్స్లో స్థానం సంపాదించింది.
ఇప్పుడు, అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా, మళ్లీ థియేటర్స్లోకి వస్తోంది. ఒరిజినల్ మోనో మిక్స్ సౌండ్ను తొలిసారి డాల్బీ ఆట్మాస్, హై ఎండ్ AI ఇంజనీరింగ్తో రీ–క్రియేట్ చేశారు.
ఈ రీ–రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. “శివ నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా. నా క్యారెక్టర్ మరిచిపోలేని స్థాయికి వెళ్లింది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి, నా అన్నయ్య వెంకట్ అక్కినేని, నేను కలిసి, దీన్ని గ్రాండ్గా రీ–రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్లో చూసిన కొత్త జెనరేషన్కి కూడా థియేటర్లో అనుభవం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే RGV, వెంకట్, నేను కలసి, డాల్బీ ఆట్మాస్ సౌండ్తో, 4K విజువల్స్తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం'అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాగార్జున, ప్రొడ్యూసర్స్ నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రోజుకీ ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ను గుర్తుపెట్టుకోవడం నాకు అద్భుతంగా అనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ రీ–రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు నిజంగా థ్రిల్ ఇచ్చింది. ఒరిజినల్ సౌండ్ అప్పట్లో చాలా హైగా అప్రిషియేట్ చేయబడినా, ఈ రోజు స్టాండర్డ్స్కి సరిపడేలా మొత్తం రీ–డూ చేయాలని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్డ్ AI టెక్నాలజీతో, మోనో మిక్స్ను డాల్బీ ఆట్మాస్కి మార్చాం. శివని అందరూ చూసే ఉంటారు, కానీ ఈ కొత్త సౌండ్తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్ పీరియన్స్ చేయలేదు.ఈ సారి ఆ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ'అన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







