'శివ' త్వరలో తెలుగులో రీ-రిలీజ్
- August 11, 2025
శివ రీ-రిలీజ్ టీజర్ ఆగస్టు 14న విడుదల కానున్న కూలీతో వస్తోంది. ఆడియన్స్ డాల్బీ అట్మోస్లో 4 కె విజువల్స్తో శివ కొత్త సౌండ్, విజువల్ ని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
ఇండియన్ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన శివ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సారి సౌండ్ మొత్తం హై ఎండ్ AI టెక్నాలజీతో రీ–డిజైన్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివా తన రా ఇంటెన్సిటీ, రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్తో సినిమాకు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. CNN–IBN టాప్ 100 ఇండియన్ ఫిల్మ్స్లో స్థానం సంపాదించింది.
ఇప్పుడు, అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా, మళ్లీ థియేటర్స్లోకి వస్తోంది. ఒరిజినల్ మోనో మిక్స్ సౌండ్ను తొలిసారి డాల్బీ ఆట్మాస్, హై ఎండ్ AI ఇంజనీరింగ్తో రీ–క్రియేట్ చేశారు.
ఈ రీ–రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. “శివ నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా. నా క్యారెక్టర్ మరిచిపోలేని స్థాయికి వెళ్లింది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి, నా అన్నయ్య వెంకట్ అక్కినేని, నేను కలిసి, దీన్ని గ్రాండ్గా రీ–రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్లో చూసిన కొత్త జెనరేషన్కి కూడా థియేటర్లో అనుభవం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే RGV, వెంకట్, నేను కలసి, డాల్బీ ఆట్మాస్ సౌండ్తో, 4K విజువల్స్తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం'అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాగార్జున, ప్రొడ్యూసర్స్ నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రోజుకీ ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ను గుర్తుపెట్టుకోవడం నాకు అద్భుతంగా అనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ రీ–రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు నిజంగా థ్రిల్ ఇచ్చింది. ఒరిజినల్ సౌండ్ అప్పట్లో చాలా హైగా అప్రిషియేట్ చేయబడినా, ఈ రోజు స్టాండర్డ్స్కి సరిపడేలా మొత్తం రీ–డూ చేయాలని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్డ్ AI టెక్నాలజీతో, మోనో మిక్స్ను డాల్బీ ఆట్మాస్కి మార్చాం. శివని అందరూ చూసే ఉంటారు, కానీ ఈ కొత్త సౌండ్తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్ పీరియన్స్ చేయలేదు.ఈ సారి ఆ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ'అన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







