యూఏఈలో పెర్సీడ్స్ ఉల్కాపాతం..!!
- August 12, 2025
యూఏఈః ఆగస్టు 12న యూఏఈలో పెర్సీడ్స్ కనువిందు చేయనుంది. ఆరోజున ఆకాశంలో పెర్సీడ్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు తెలిపారు. పెర్సీడ్స్ జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుందని, ఇది ఆగస్టు 12 నుండి 13 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ తెలిపింది.అయితే, వీటిని స్పష్టంగా చూడాలంటే.. సిటీకి దూరంగా చీకటి బాగా ఉన్న కొండ ప్రాంతం నుంచి వీక్షించాలని సూచించారు.కాగా, వీటిని నేరుగా కంటితో చూడవచ్చని తెలిపింది.
ఆగస్టు 12న రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జెబెల్ జైస్లో ప్రత్యేక పెర్సియిడ్స్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.ఈ పెర్సియిడ్స్ సెకనుకి 59 కిలో మీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని, అ సమయంలో అవి మండిపోతాయని పేర్కొంది.
డైనోసార్ల కంటే స్విఫ్ట్-టటిల్ తోకచుక్క దాదాపు రెండు రెట్లు పెద్దగా ఉంటుందని, ఇది ప్రతి 133 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నారు. చివరిసారిగా 1992లో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఙది 2126లో తిరిగి భూమికి దగ్గరగా వస్తుందన్నారు. కాబట్టి, ఈ జీవిత కాలంలో వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకండి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







