యూఏఈలో పెర్సీడ్స్ ఉల్కాపాతం..!!
- August 12, 2025
యూఏఈః ఆగస్టు 12న యూఏఈలో పెర్సీడ్స్ కనువిందు చేయనుంది. ఆరోజున ఆకాశంలో పెర్సీడ్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు తెలిపారు. పెర్సీడ్స్ జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుందని, ఇది ఆగస్టు 12 నుండి 13 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ తెలిపింది.అయితే, వీటిని స్పష్టంగా చూడాలంటే.. సిటీకి దూరంగా చీకటి బాగా ఉన్న కొండ ప్రాంతం నుంచి వీక్షించాలని సూచించారు.కాగా, వీటిని నేరుగా కంటితో చూడవచ్చని తెలిపింది.
ఆగస్టు 12న రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జెబెల్ జైస్లో ప్రత్యేక పెర్సియిడ్స్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.ఈ పెర్సియిడ్స్ సెకనుకి 59 కిలో మీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని, అ సమయంలో అవి మండిపోతాయని పేర్కొంది.
డైనోసార్ల కంటే స్విఫ్ట్-టటిల్ తోకచుక్క దాదాపు రెండు రెట్లు పెద్దగా ఉంటుందని, ఇది ప్రతి 133 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నారు. చివరిసారిగా 1992లో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఙది 2126లో తిరిగి భూమికి దగ్గరగా వస్తుందన్నారు. కాబట్టి, ఈ జీవిత కాలంలో వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకండి.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







