యూఏఈలో పెర్సీడ్స్ ఉల్కాపాతం..!!
- August 12, 2025
యూఏఈః ఆగస్టు 12న యూఏఈలో పెర్సీడ్స్ కనువిందు చేయనుంది. ఆరోజున ఆకాశంలో పెర్సీడ్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు తెలిపారు. పెర్సీడ్స్ జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుందని, ఇది ఆగస్టు 12 నుండి 13 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ తెలిపింది.అయితే, వీటిని స్పష్టంగా చూడాలంటే.. సిటీకి దూరంగా చీకటి బాగా ఉన్న కొండ ప్రాంతం నుంచి వీక్షించాలని సూచించారు.కాగా, వీటిని నేరుగా కంటితో చూడవచ్చని తెలిపింది.
ఆగస్టు 12న రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జెబెల్ జైస్లో ప్రత్యేక పెర్సియిడ్స్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.ఈ పెర్సియిడ్స్ సెకనుకి 59 కిలో మీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని, అ సమయంలో అవి మండిపోతాయని పేర్కొంది.
డైనోసార్ల కంటే స్విఫ్ట్-టటిల్ తోకచుక్క దాదాపు రెండు రెట్లు పెద్దగా ఉంటుందని, ఇది ప్రతి 133 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నారు. చివరిసారిగా 1992లో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఙది 2126లో తిరిగి భూమికి దగ్గరగా వస్తుందన్నారు. కాబట్టి, ఈ జీవిత కాలంలో వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకండి.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









