యూఏఈలో పెర్సీడ్స్ ఉల్కాపాతం..!!
- August 12, 2025
యూఏఈః ఆగస్టు 12న యూఏఈలో పెర్సీడ్స్ కనువిందు చేయనుంది. ఆరోజున ఆకాశంలో పెర్సీడ్స్ గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నిపుణులు తెలిపారు. పెర్సీడ్స్ జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుందని, ఇది ఆగస్టు 12 నుండి 13 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ తెలిపింది.అయితే, వీటిని స్పష్టంగా చూడాలంటే.. సిటీకి దూరంగా చీకటి బాగా ఉన్న కొండ ప్రాంతం నుంచి వీక్షించాలని సూచించారు.కాగా, వీటిని నేరుగా కంటితో చూడవచ్చని తెలిపింది.
ఆగస్టు 12న రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జెబెల్ జైస్లో ప్రత్యేక పెర్సియిడ్స్ చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది.ఈ పెర్సియిడ్స్ సెకనుకి 59 కిలో మీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని, అ సమయంలో అవి మండిపోతాయని పేర్కొంది.
డైనోసార్ల కంటే స్విఫ్ట్-టటిల్ తోకచుక్క దాదాపు రెండు రెట్లు పెద్దగా ఉంటుందని, ఇది ప్రతి 133 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్నారు. చివరిసారిగా 1992లో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిందని పేర్కొన్నారు. మళ్లీ ఙది 2126లో తిరిగి భూమికి దగ్గరగా వస్తుందన్నారు. కాబట్టి, ఈ జీవిత కాలంలో వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ కాకండి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







