ఖతార్ టూరిజం: రికార్డు స్థాయిలో 2.6 మిలియన్ల విజిటర్స్..!!
- August 12, 2025
దోహా: 2025 ప్రథమార్థంలో ఖతార్లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నుంచి జూన్ మధ్య 2.6 మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ ను సందర్శించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల నమోదైంది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి అత్యధికంగా 36శాతం సందర్శకులు వచ్చారు. ఆ తరువాత 26 శాతం సందర్శకులు యూరప్ నుండి రాగా, ఆసియా మరియు ఓషియానియా నుండి 22శాతం , అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుండి 7 శాతం చొప్పున సందర్శకులు ఖతార్ లో అడుగుపెట్టారని టూరిజం మంత్రిత్వ శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది.
సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్ళు సగటు ఆక్యుపెన్సీ రేటు 71శాతానికి చేరుకుంది. గతేడాది కంటే 2 శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఖతార్ టూరిజం మొత్తం 2024లో దేశ జిడిపికి QR55 బిలియన్లను అందించిందన్నారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో 8శాతానికి సమానమని, అంతకుముందు ఏడాది కంటే ఇది 14% పెరుగుదల అని తెలిపారు. 2030 కల్లా ఖతార్ జీడీపీలో టూరిజం భాగస్వామ్యాన్ని 10-12%కి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







