ఖతార్ టూరిజం: రికార్డు స్థాయిలో 2.6 మిలియన్ల విజిటర్స్..!!
- August 12, 2025
దోహా: 2025 ప్రథమార్థంలో ఖతార్లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నుంచి జూన్ మధ్య 2.6 మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ ను సందర్శించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల నమోదైంది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి అత్యధికంగా 36శాతం సందర్శకులు వచ్చారు. ఆ తరువాత 26 శాతం సందర్శకులు యూరప్ నుండి రాగా, ఆసియా మరియు ఓషియానియా నుండి 22శాతం , అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుండి 7 శాతం చొప్పున సందర్శకులు ఖతార్ లో అడుగుపెట్టారని టూరిజం మంత్రిత్వ శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది.
సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్ళు సగటు ఆక్యుపెన్సీ రేటు 71శాతానికి చేరుకుంది. గతేడాది కంటే 2 శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఖతార్ టూరిజం మొత్తం 2024లో దేశ జిడిపికి QR55 బిలియన్లను అందించిందన్నారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో 8శాతానికి సమానమని, అంతకుముందు ఏడాది కంటే ఇది 14% పెరుగుదల అని తెలిపారు. 2030 కల్లా ఖతార్ జీడీపీలో టూరిజం భాగస్వామ్యాన్ని 10-12%కి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







