ఖతార్ టూరిజం: రికార్డు స్థాయిలో 2.6 మిలియన్ల విజిటర్స్..!!
- August 12, 2025
దోహా: 2025 ప్రథమార్థంలో ఖతార్లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నుంచి జూన్ మధ్య 2.6 మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ ను సందర్శించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల నమోదైంది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి అత్యధికంగా 36శాతం సందర్శకులు వచ్చారు. ఆ తరువాత 26 శాతం సందర్శకులు యూరప్ నుండి రాగా, ఆసియా మరియు ఓషియానియా నుండి 22శాతం , అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుండి 7 శాతం చొప్పున సందర్శకులు ఖతార్ లో అడుగుపెట్టారని టూరిజం మంత్రిత్వ శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది.
సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్ళు సగటు ఆక్యుపెన్సీ రేటు 71శాతానికి చేరుకుంది. గతేడాది కంటే 2 శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఖతార్ టూరిజం మొత్తం 2024లో దేశ జిడిపికి QR55 బిలియన్లను అందించిందన్నారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో 8శాతానికి సమానమని, అంతకుముందు ఏడాది కంటే ఇది 14% పెరుగుదల అని తెలిపారు. 2030 కల్లా ఖతార్ జీడీపీలో టూరిజం భాగస్వామ్యాన్ని 10-12%కి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







