ఖతార్ టూరిజం: రికార్డు స్థాయిలో 2.6 మిలియన్ల విజిటర్స్..!!
- August 12, 2025
దోహా: 2025 ప్రథమార్థంలో ఖతార్లో పర్యాటక రంగం మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నుంచి జూన్ మధ్య 2.6 మిలియన్లకు పైగా అంతర్జాతీయ సందర్శకులు ఖతార్ ను సందర్శించారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం పెరుగుదల నమోదైంది.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల నుండి అత్యధికంగా 36శాతం సందర్శకులు వచ్చారు. ఆ తరువాత 26 శాతం సందర్శకులు యూరప్ నుండి రాగా, ఆసియా మరియు ఓషియానియా నుండి 22శాతం , అమెరికా మరియు ఇతర అరబ్ దేశాల నుండి 7 శాతం చొప్పున సందర్శకులు ఖతార్ లో అడుగుపెట్టారని టూరిజం మంత్రిత్వ శాఖ తన తాజా రిపోర్టులో వెల్లడించింది.
సందర్శకుల రాకలో వృద్ధి కారణంగా హోటళ్ళు సగటు ఆక్యుపెన్సీ రేటు 71శాతానికి చేరుకుంది. గతేడాది కంటే 2 శాతం పెరిగిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఖతార్ టూరిజం మొత్తం 2024లో దేశ జిడిపికి QR55 బిలియన్లను అందించిందన్నారు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో 8శాతానికి సమానమని, అంతకుముందు ఏడాది కంటే ఇది 14% పెరుగుదల అని తెలిపారు. 2030 కల్లా ఖతార్ జీడీపీలో టూరిజం భాగస్వామ్యాన్ని 10-12%కి పెంచే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









