సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు హెచ్చరికలు..!!
- August 13, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 20 రోజుల పాటు వేతన ఫైళ్లను సమర్పించడంలో జాప్యం చేస్తే తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించింది. వేతన డేటాను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ముదాద్ ప్రోగ్రామ్ సంస్థలకు ఇమెయిల్ నోటిఫికేషన్ లను పంపుతుంది. 10 రోజుల తర్వాత, ఫైల్ను సమర్పించని సంస్థలకు మరో నోటిఫికేషన్ పంపబడుతుందని, వేతనాలు చెల్లించాల్సిన 15 రోజుల తర్వాత, వేతన ఫైళ్లను సమర్పించని యజమానులకు తుది హెచ్చరిక పంపబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలాంటి కారణం లేకుండా 20 రోజులు దాటినట్టయితే, తప్పు చేసిన సంస్థలపై అధికారులు రైడ్స్ చేస్తారని తెలిపింది.
కాగా, కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలపడానికి సంస్థలకు 10 రోజుల వ్యవధి ఉంటుందని ముదద్ ప్లాట్ఫామ్ ప్రకటించింది. పేర్కొన్న వ్యవధిలోపు వేతనాలు అందించడంలో విఫలమైతే, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఒక సంస్థ రెండు నెలల పాటు జీతాల చెల్లింపులను ఆలస్యం చేస్తే, వర్కింగ్ ఆర్డర్స్ తోపాటు రెన్యువల్ మినహా అన్ని సేవలను నిలిపివేయడం ద్వారా జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. ఆలస్యం మూడు నెలలు దాటితే, అన్ని సేవలు నిలిపివేయబడతాయని, దాంతోపాటు కార్మికుడు తన వర్క్ పర్మిట్ చెల్లుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుత యజమాని ఆమోదం లేకుండా తన సేవలను మరొక యజమానికి బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







