సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు హెచ్చరికలు..!!
- August 13, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేట్ సంస్థలకు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 20 రోజుల పాటు వేతన ఫైళ్లను సమర్పించడంలో జాప్యం చేస్తే తనిఖీలు నిర్వహిస్తామని ప్రకటించింది. వేతన డేటాను అప్లోడ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ముదాద్ ప్రోగ్రామ్ సంస్థలకు ఇమెయిల్ నోటిఫికేషన్ లను పంపుతుంది. 10 రోజుల తర్వాత, ఫైల్ను సమర్పించని సంస్థలకు మరో నోటిఫికేషన్ పంపబడుతుందని, వేతనాలు చెల్లించాల్సిన 15 రోజుల తర్వాత, వేతన ఫైళ్లను సమర్పించని యజమానులకు తుది హెచ్చరిక పంపబడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎలాంటి కారణం లేకుండా 20 రోజులు దాటినట్టయితే, తప్పు చేసిన సంస్థలపై అధికారులు రైడ్స్ చేస్తారని తెలిపింది.
కాగా, కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం కావడానికి గల కారణాన్ని తెలపడానికి సంస్థలకు 10 రోజుల వ్యవధి ఉంటుందని ముదద్ ప్లాట్ఫామ్ ప్రకటించింది. పేర్కొన్న వ్యవధిలోపు వేతనాలు అందించడంలో విఫలమైతే, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఒక సంస్థ రెండు నెలల పాటు జీతాల చెల్లింపులను ఆలస్యం చేస్తే, వర్కింగ్ ఆర్డర్స్ తోపాటు రెన్యువల్ మినహా అన్ని సేవలను నిలిపివేయడం ద్వారా జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది. ఆలస్యం మూడు నెలలు దాటితే, అన్ని సేవలు నిలిపివేయబడతాయని, దాంతోపాటు కార్మికుడు తన వర్క్ పర్మిట్ చెల్లుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుత యజమాని ఆమోదం లేకుండా తన సేవలను మరొక యజమానికి బదిలీ చేసుకోవడానికి అనుమతిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







