యూఏఈలో 5 నెలల చిన్నారిని కాపాడిన మేనత్త..!!
- August 13, 2025
యూఏఈ: అబుదాబిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5నెలల తన మేనల్లుడిని ఓ అత్త తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించింది. కేవలం 4.4 కిలోగ్రాముల బరువున్న బేబీ అహ్మద్ యాహ్యా ఆసుపత్రిలో చేరాడు. అతని లివర్ వేగంగా క్షీణిస్తోందని వైద్యలు తెలిపారు. అతని తల్లిదండ్రులు యాహ్యా., జైనాబ్ అల్ యాస్సీ ఇప్పటికే ఒక కొడుకును ఇదే జబ్బు కారణంగా కోల్పోయారు.
ఎలాగైన తన మేనల్లుడి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకున్నట్లు లీవర్ డొనేట్ చేసిన మేనత్త తెలిపింది. అహ్మద్ అనారోగ్యం పెరుగుతోందని, అతని కాలేయం, ఇతర ముఖ్యమైన వ్యవస్థలు ఇప్పుడు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
ATP6AP1- సంబంధిత పుట్టుకతో వచ్చే గ్లైకోసైలేషన్ జబ్బు తో బేబీ జన్మించాడని వైద్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు 25 కంటే తక్కువ నమోదైనట్లు తెలిపారు. యాహ్యా సోదరుడి భార్య లివర్ దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది.
ఏప్రిల్ 4న, BMC యొక్క మల్టీడిసిప్లినరీ ట్రాన్స్ప్లాంట్ బృందం పీడియాట్రిక్ సర్జరీలను చేపట్టింది. ట్రాన్స్ప్లాంట్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ గౌరబ్ సేన్, డాక్టర్ మాథ్యూ నేతృత్వంలో, ఆపరేషన్కు విజయవంతంగా నిర్వహించారు. బేబీ కోలుకుంటుందని, లీవర్ చక్కగా పనిచేస్తుందని డాక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









