ఘనంగా గాయకుడు రవీంద్రనాథ్ ఆచార్య జన్మదిన వేడుకలు
- August 13, 2025
హైదరాబాద్: రాంకీ మెలోడీస్, మధుర వీణ మ్యూజికల్స్, ది గంటీస్ సమైక్య ఆధ్వర్యంలో, వై.ఎస్.రామక నిర్వహణలో గాయకుడు రవీంద్రనాథ్ ఆచార్య జన్మదిన వేడుకలు అలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి బహుగళ, బహుభాషా గాయకులు తమ గానంతో కార్యక్రమానికి మధురిమను జోడించారు.
ఈ వేడుకలకు పూర్వ డైరెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం బీ.రాజగోపాలరావు, కళాబ్రహ్మ డా.వంశీ రామరాజు, డా. సుధాదేవి, డా. రాజా వొజ్జల, తణికెళ్ళ రామకృష్ణ, కె.ఈ. రాజు తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
డా. వంశీ రామరాజు మాట్లాడుతూ, రవీంద్రనాథ్ ఆచార్య అనేక రంగాలలో తన ప్రతిభను నిరూపించుకున్న గాయకుడు, కళాకారుడు అని ప్రశంసించారు. తన తరఫున ఆచార్యను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో పలువురు గాయనీ, గాయకులు ఎన్నో చిరస్మరణీయమైన సినీ గీతాలను ఆహ్లాదకరంగా ఆలపించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







