కువైట్ లో 23కు చేరిన నకిలీ మద్యం మృతుల సంఖ్య..!!
- August 15, 2025
కువైట్: కువైట్ లో నకిలీ మద్యం మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23మంది మరణించగా, వివిధ ఆస్పత్రులలో 160మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కువైట్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు.
నకిలీ మద్యం బాధితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారి కోసం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యానికి దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 24 గంటల అత్యవసర హాట్లైన్లు అందుబాటులో ఉన్నాయని, బాధితులు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. నకిలీ మద్యం బాధితులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.
మరోవైపు మరణించిన భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే బాధిత డెడ్ బాడీలను భారత్ లోని సొంత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









