కువైట్ లో 23కు చేరిన నకిలీ మద్యం మృతుల సంఖ్య..!!
- August 15, 2025
కువైట్: కువైట్ లో నకిలీ మద్యం మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23మంది మరణించగా, వివిధ ఆస్పత్రులలో 160మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కువైట్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు.
నకిలీ మద్యం బాధితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారి కోసం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యానికి దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 24 గంటల అత్యవసర హాట్లైన్లు అందుబాటులో ఉన్నాయని, బాధితులు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. నకిలీ మద్యం బాధితులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.
మరోవైపు మరణించిన భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే బాధిత డెడ్ బాడీలను భారత్ లోని సొంత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి









