కువైట్ లో 23కు చేరిన నకిలీ మద్యం మృతుల సంఖ్య..!!
- August 15, 2025
కువైట్: కువైట్ లో నకిలీ మద్యం మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 23మంది మరణించగా, వివిధ ఆస్పత్రులలో 160మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కువైట్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు.
నకిలీ మద్యం బాధితుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారి కోసం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ఎమర్జెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యానికి దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. 24 గంటల అత్యవసర హాట్లైన్లు అందుబాటులో ఉన్నాయని, బాధితులు వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. నకిలీ మద్యం బాధితులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది.
మరోవైపు మరణించిన భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే బాధిత డెడ్ బాడీలను భారత్ లోని సొంత ప్రాంతాలకు తరలించేందుకు స్వచ్ఛంధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







