యూఏఈ వచ్చే ఫ్లైట్స్ ఫుల్.. టిక్కెట్ల ధరలకు రెక్కలు..!!
- August 15, 2025
యూఏఈ: యూఏఈలో వేసవి సెలవులు ముగింపు దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూఏఈకి వచ్చే ఫ్లైట్స్ అన్ని ఫుల్ అవుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఇంకా అందుబాటులో ఉన్న కొద్దిపాటి సీట్ల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఆగస్టు నెల ప్రారంభంతో పోలిస్తే అనేక మార్గాల్లో టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయని, కొన్ని గమ్యస్థానాలకు ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయని గలాదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ మీర్ రాజా వాసిమ్ తెలిపారు.
భారతదేశం నుండి సగటు టికెట్ ధర Dh2,000 కంటే ఎక్కువగా ఉందన్నారు. ఇక ఫ్యామిలీ కోసం బుకింగ్ చేసేటప్పుడు ధర పెరుగుదలలో Dh5,000 నుండి Dh6,000 వరకు తేడా ఉంటుందన్నారు. సాధారణ విమాన ఛార్జీలతో పోలిస్తే ఒక టికెట్కు కనీసం Dh1,000 అదనంగా ఉంటుందని వైస్ఫాక్స్ టూరిజం సీనియర్ మేనేజర్ సుబైర్ అన్నారు. కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన ఛార్జీలు కాస్తా తక్కువగా ఉన్నాయని, ఆయా ఫ్లైట్స్ వేగంగా ఫుల్ అవుతున్నాయని పేర్కొన్నారు.
ఆగస్టు రెండవ భాగంలో అనేక దేశాల నుండి తిరుగు ప్రయాణ ఛార్జీలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. భారతదేశంలోని అనేక రంగాల నుండి సుమారు Dh1,000 ఖరీదు చేసే లేఓవర్ విమాన టిక్కెట్ ధరలు ఇప్పుడు Dh1,500 కంటే ఎక్కువగా ఉన్నాయని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







