క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి
- August 15, 2025
హైదరాబాద్: హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 70కిపైగా ప్రతిష్టాత్మక డెవలపర్లు రూపొందించిన రేరా ఆమోదం పొందిన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అన్వితా డైరెక్టర్లు బొప్పన నాగభూషణం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







