క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ ను సందర్శించిన ముఖ్యమంత్రి
- August 15, 2025
హైదరాబాద్: హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో అన్వితా గ్రూప్ స్టాల్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. తొలుత ప్రాపర్టీ షోను ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి సహకరిస్తామన్నారు. అన్వితా గ్రూప్ సీఎండీ బొప్పన అచ్యుత రావు ముఖ్యమంత్రిని తమ స్టాల్ కు ఆహ్వానించి, సంస్థ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వివరాలు వివరించారు. నాణ్యత, అంకితభావంతో పనిచేస్తున్న అన్విత గ్రూప్ ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15 నుంచి 17 వరకు కొనసాగుతుంది. 70కిపైగా ప్రతిష్టాత్మక డెవలపర్లు రూపొందించిన రేరా ఆమోదం పొందిన నివాస, వాణిజ్య ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉంటాయి. ఈ కార్యక్రమంలో అన్వితా డైరెక్టర్లు బొప్పన నాగభూషణం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







