యూఏఈలో 4.3 మిలియన్ల మంది భారతీయులు..!!

- August 16, 2025 , by Maagulf
యూఏఈలో 4.3 మిలియన్ల మంది భారతీయులు..!!

యూఏఈ; దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా భారతీయ ప్రవాసులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ జెండాను ఎగురవేశారు. అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
యూఏఈతో సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు.  యూఏఈలోని 4.36 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నారని తెలిపారు. యూఏఈ నిర్మాణంలో వారు భాగస్వాములని పేర్కొన్నారు.  2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com